అమానుషాన్ని ఆపేంత వరకూ గొంతెత్తండి..

సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఫొటో - Sakshi


అయ్యప్ప భక్తుడి ఆవేదన

యడ్లపాడు(చిలకలూరిపేట) : బర్మా దేశంలో ముస్లింలపై దాడులను అరికట్టాలని కోరుతూ ఇచ్చిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ పోస్టుకు లైకులు, షేర్‌లు భారీగా వస్తున్నాయి. సాంకేతిక విప్లవం ప్రజ్వరిల్లుతున్న కాలంలో జాతి విద్వేష మారణకాండను నిలిపి వేయాలంటూ..



అయ్యప్ప మాలధారణ చేసిన వ్యక్తి వైట్‌ చార్టుపై తన అభిప్రాయాన్ని రాసి దిగిన ఈ ఫొటోను తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేసిన కొన్ని గంటల్లోనే 3 లక్షలకు పైగా లైకులు, లక్షన్నర మంది నెటిజన్లు ఆ ఫొటోను షేర్‌ చేసుకోవడంతో పాటు వందలాది మంది ఇతర దేశాలకు చెందిన వారు ఫోన్లు చేయడం విశేషం. మారణకాండను ఆపేంతవరకు ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలతో సోషల్‌ మీడియా ద్వారా ప్రభావితం చేయాలని వారు    కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top