కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
నిడదవోలు : పట్టణంలోని బసివిరెడ్డిపేట వద్ద పశ్చిమడెల్టా ప్రధాన కాలువలోకి ఓ ఆటో దూసుకెళ్లగా డ్రై వర్తో సహా ఎనిమిది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
నిడదవోలు : పట్టణంలోని బసివిరెడ్డిపేట వద్ద పశ్చిమడెల్టా ప్రధాన కాలువలోకి ఓ ఆటో దూసుకెళ్లగా డ్రై వర్తో సహా ఎనిమిది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. చాగల్లు నుంచి అయితా నాగలక్ష్మి తన కుమార్తె బొండాడ సత్య, మూడు నెలల చిన్నారిని సారెతో కుమార్తె అత్తిల్లు గణపవరం మండలం కేశవరం తీసుకువెళ్లేందుకులో ఆటోలో బయలుదేరారు. ఆటోలో డ్రై వర్తో సహా 8 మంది కుటుంబసభ్యులు ఉన్నారు. ఈ ఆటో బసివిరెడ్డిపేట వద్దకు వచ్చేసరికి నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న క్వారీ లారీ ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి ఆటో బోల్తా కొట్టింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆటోలోని ప్రయాణికులను బయటకు లాగారు. ఈ సమయంలో చిన్నారిని తల్లి సత్య తన ఒడిలోనే గట్టిగా పట్టుకుని ఉండటంతో కాపాడుకోగలిగింది. ఎసై ్స ఎం.భగవాన్ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.