
టీడీపీ ఎంపీ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ల సదస్సు
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు బుధవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు బుధవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం పేరుతో మరోసారి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి తెర లేపింది. రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు ప్రభుత్వం దాదాపు రూ. కోటి ఖర్చు చేస్తోంది. స్టార్ హోటల్లో వసతి, విమాన ఛార్జీలు, భోజన వసతులకు భారీగా నిధులు మంజూరు చేసింది.
గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సును నగరంలోని ఏ1 ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఇది అందరికీ అందుబాటులో ఉండేది. అయితే ఈ సారి నగరానికి దూరంగా ఉన్న ఓ టీడీపీ ఎంపీ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇకపై టీడీపీ ఎంపీ ఫంక్షన్ హాల్లోనే సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ ఎంపీ కోసమే నగరానికి దూరంగా ఉన్న ఫంక్షన్ హాల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.