టీడీపీ నేత ప్రదీప్కు ఏసీబీ నోటీసులు | acb notices to tdp leader pradeep | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ప్రదీప్కు ఏసీబీ నోటీసులు

Jul 19 2015 10:31 AM | Updated on Aug 17 2018 12:56 PM

టీడీపీ నేత ప్రదీప్కు ఏసీబీ నోటీసులు - Sakshi

టీడీపీ నేత ప్రదీప్కు ఏసీబీ నోటీసులు

ఓటుకు కోట్లు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఉన్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా ఏసీబీ అధికారులు టీడీపీ నేత ప్రదీప్కు ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందించారు

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఉన్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా ఏసీబీ అధికారులు టీడీపీ నేత ప్రదీప్కు ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందించారు. 160సీఆర్పీసీ కింద ప్రదీప్కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

గతంలో సీఆర్పీసీ కింద టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఇద్దరు డ్రైవర్లకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే విచారించారు. విచారణ జరిగిన వెంటనే టీడీపీ నేత ప్రదీప్కు నోటీసులు జారీ చేయడం మరోసారి ఓటుకు నోటుకు కేసు చర్చనీయాంశంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement