ఏసీబీ అధికారుల దర్యాప్తు | acb enquiry | Sakshi
Sakshi News home page

ఏసీబీ అధికారుల దర్యాప్తు

Jul 22 2016 5:40 PM | Updated on Aug 17 2018 12:56 PM

చేజర్ల : ఇటీవల అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కిన సంగం తహసీల్దారు సుశీలకు సంబంధించి చేజర్ల మండలంలో ఉన్న ఆస్తులపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

 
 
చేజర్ల : ఇటీవల అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కిన సంగం తహసీల్దారు సుశీలకు సంబంధించి చేజర్ల మండలంలో ఉన్న ఆస్తులపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గురువారం ఏసీబీ సీఐ శివకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది చేజర్ల, మడపల్లి, యనమదాలలో సుశీలకు సంబంధించిన వ్యవసాయ భూములు, ఆస్తులను పరిశీలించి వివరాలను సేకరించారు. ఆకస్మికంగా ఏసీబీ అధికారులు మండలానికి రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement