శేషాచలం ప్రాంతమైన కడప, చిత్తూరు జిల్లా సరిహద్దు సరిహద్దు మండలాలయిన సుండుపల్లె మండలం పింఛా ప్రదేశం బొమ్మల కనుమ ప్రదేశంలో సోమవారం అర్ధరాత్రి రాజంపేట, పీలేరు, సానీపాయి ఫారెస్టు అధికారులు నిఘా పెట్టగా 40 ఎర్రచందనం దుంగలు, ఈచర్ వాహనం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సుండుపల్లె: శేషాచలం ప్రాంతమైన కడప, చిత్తూరు జిల్లా సరిహద్దు సరిహద్దు మండలాలయిన సుండుపల్లె మండలం పింఛా ప్రదేశం బొమ్మల కనుమ ప్రదేశంలో సోమవారం అర్ధరాత్రి రాజంపేట, పీలేరు, సానీపాయి ఫారెస్టు అధికారులు నిఘా పెట్టగా 40 ఎర్రచందనం దుంగలు, ఈచర్ వాహనం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని రాజంపేట ఫారెస్టు కార్యాలయానికి (ఠానా) తరలించినట్లు విశ్వసనీయ సమాచరం. అదే విధంగా ఫారెస్టు అధికారులు అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.