-
‘బొమ్మల కొలువు’ ట్రైలర్ విడుదల
‘రఘువరన్ బి.టెక్’తో సినీ రంగ ప్రవేశం చేసిన మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ తమ్ముడు రిషికేశ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఎ.వి.ఆర్.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మల కొలువు’. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కోన వెంకట్, బి.వి.ఎస్.రవి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...హీరో రిషికేశ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు సుబ్బుగారు డిఫరెంట్గా తెరకెక్కించారు. నాపై నమ్మకంతో రుద్ర అనే పాత్రను నాకు ఇచ్చారు. అలాగే నిర్మాత స్వామిగారికి స్పెషల్ థాంక్స్. సినిమాలంటే ఉండే ప్యాషన్తో సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు. -
దీపావళి లోగిలిలో అందమైన బొమ్మల కొలువు
చీకట్లను చీల్చి వెలుగునిచ్చే పండుగగా దీపావళిని జరుపుకుంటారన్న సంగతి మనకు తెలిసిందే. దీపావళి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకొని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో బొమ్మలకొలువును ఆనవాయితీగా ఏర్పాటు చేస్తుంటారు. ఈ బొమ్మల కొలువు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఈతరం పిల్లలకు భారతీయ ధర్మం పట్ల అవగాహన, అభిరుచిని పెంపొందింస్తారు. అలాగే పురాణ, ఇతిహాసాలను కథల రూపంలో పిల్లలకు తెలియజేస్తూ భారతీయ సంప్రదాయంపై గౌరవం కలిగేలా చూస్తారు. బొమ్మల కొలువును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. నరక చతుర్దశి రోజున బొమ్మల కొలువును ఏర్పాటు చేసి దీపావళి మరుసటి రోజు సాయంత్రం వరకు దీనిని నిర్వహిస్తారు. బొమ్మలు కొలువు పెట్టే విధానం : బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా.. ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది. బొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు. గౌరమ్మ పూజ అనంతరం కలశం ఏర్పాటు చేసి తమ వద్ద ఉన్న వివిధ బొమ్మలను వరుస క్రమంలో అలంకరిస్తారు. అనంతరం చక్కెర పొంగలి, పేనీలు, పసుసు, కుంకుమ నైవేద్యంగా సమర్పిస్తారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా వివిధ పండులను బొమ్మలకొలువు రూపంలో ఏర్పాటు చేసి వాటి విశిష్టతను తమ పిల్లలకు కథల రూపంలో వివరిస్తారు. తమ చుట్టపక్కల ఉండే మహిళలను, పిల్లలను పిలిచి తమ బొమ్మల కొలువును చూపి వారికి వాయినాన్ని అందజేస్తారు. దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ దేవి పూజను నిర్వహించి బొమ్మల కొలువు చుట్టూ దొంతులనూ ఏర్పాటు చేసి నువ్వులనూనెతో మాత్రమే దీపాలను వెలిగిస్తారు. ఇక మూడో రోజున ఐదుగురు ముల్తైదలను పిలిచి వారికి పసుపు, కుంకుమలను వాయినంగా సమర్పించి , అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడంతో కార్యక్రమం ముగుస్తుంది. -
విశాఖలో బొమ్మల కొలువు
-
అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు
సాక్షి, ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు దుర్గ గుడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, ఆశీర్వచన మండపంలో బొమ్మల కొలువు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల సందడి ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది తొలిసారిగా అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ ఏడాది కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎయిర్పోర్టులో బొమ్మల కొలువు
సాక్షి, దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్పోర్టులో దసరా బొమ్మల కొలువు సందడి చేస్తోంది. గత రెండేళ్లుగా ఎయిర్పోర్టు అధికారులు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల నుండి అనూహ్య స్పందన రావడంతో ఈ సంవత్సరం కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. భారతదేశపు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. విదేశీయులు బొమ్మల కొలువు గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఇక సెల్ఫీలకైతే కొదువేలేదు. సాయంత్రం నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుండడంతో ప్రయాణికులు ఫిదా అవుతున్నారు. దసరా ముగిసే వరకూ ఈ బొమ్మల కొలువు ఉంటుందని ఎయిర్పోర్టు ముఖ్య అధికారి సజీత్ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
Advertisement