తిరుపతిలో విషాదం.. నలుగురి మృతి | 4 devotees died at tirumala kapilatheertham pushkarini | Sakshi
Sakshi News home page

తిరుపతిలో విషాదం.. నలుగురి మృతి

Sep 27 2015 6:16 PM | Updated on Sep 3 2017 10:05 AM

తిరుపతిలో విషాదం.. నలుగురి మృతి

తిరుపతిలో విషాదం.. నలుగురి మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. తిరుమలలోని కపిలతీర్థం పుష్కరణి వద్దకు వెళ్లిన నలుగురు భక్తులు గల్లంతయ్యారు.

తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. తిరుపతిలోని కపిలతీర్థం పుష్కరిణిలో పడి నలుగురు భక్తులు గల్లంతయ్యారు. తిరుమల, తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జలపాతంలోకి భారీగా వరద నీరు రావడంతో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పుష్కరణిలో గల్లంతయిన వారిలో ముగ్గురి మృతదేహాలు వెలికితీశారు. మరో వ్యక్తి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను శ్రీకాంత్, వెంకటేశ్, లోహిత్ గా గుర్తించారు. ఓ పదిహేనేళ్ల పాప కూడా గల్లంతయిందని సమాచారం. మృతులంతా తిరుపతి చంద్రశేఖర్ రెడ్డి కాలనీకి చెందిన వారుగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement