జిల్లాలో 2.76 కోట్ల మెుక్కలు నాటాం | 2.76 crore plants completed in the district | Sakshi
Sakshi News home page

జిల్లాలో 2.76 కోట్ల మెుక్కలు నాటాం

Aug 17 2016 12:35 AM | Updated on Sep 18 2018 6:30 PM

జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.76 కోట్లు నాటినట్లు జేసీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హరితహారంపై సమీక్షించారు.

హన్మకొండ అర్బన్‌ : జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.76 కోట్లు నాటినట్లు జేసీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా నుంచి జేసీ మాట్లాడుతూ జిల్లాలో 95 శాతం మొక్కలు సరై్వవల్‌ అయినట్లు తెలిపారు. జియో టాగింగ్‌ విధానం కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుత జిల్లాకు రూ.11.66 కోట్లు నిధులు అవసరమని తెలిపారు. మండల ప్రత్యేక అధికారుల ద్వారా నివేదికలు తీసుకొని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పీసీ సుధార్‌బాబు, కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్, అటవీశాఖ అధికారులు రాజారావు, అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement