'యువతను పోరాటాల వైపు మళ్లిస్తాం' | 1967 Srikakulam armed conflict Leaders firing on governments | Sakshi
Sakshi News home page

'యువతను పోరాటాల వైపు మళ్లిస్తాం'

Dec 6 2015 3:52 PM | Updated on Oct 2 2018 2:30 PM

ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టే కాలానికి రోజులు చెల్లాయని 1967 శ్రీకాకుళం సాయుధ పోరాటం నేతలు అన్నారు.

శ్రీకాకుళం: ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టే కాలానికి రోజులు చెల్లాయని 1967 శ్రీకాకుళం సాయుధ పోరాట నేతలు పేర్కొన్నారు.  గిరిజన రైతాంగ సాయుధ పోరాటానికి మళ్లీ ఊపిరి పోస్తామని...యువతను పోరాటాల వైపు మళ్లిస్తామని నేతలు వ్యాఖ్యానించారు.

భూమి సాగు పట్ల రైతుల అభిప్రాయం మారడం వల్లే తుళ్లూరులో భూపోరాటం నీరు గారిందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టే రోజులు పోయాయని... ఇక ప్రజలు సహనం వహించే పరిస్థితి లేదని దీనిని ప్రభుత్వాలు కనువిప్పు చేసుకోవాలని 1967 శ్రీకాకుళం సాయుధ పోరాట నేతలు సూచించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement