జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 1,670 క్షయ వ్యాధి(టీబీ) కేసులు నమోదయ్యాయని జిల్లా క్షయ నివారణాధికారి ధవళ భాస్కరరావు తెలిపారు.
1670 టీబీ కేసులు నమోదు
Jul 27 2016 11:05 PM | Updated on Sep 4 2017 6:35 AM
పొందూరు: జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 1,670 క్షయ వ్యాధి(టీబీ) కేసులు నమోదయ్యాయని జిల్లా క్షయ నివారణాధికారి ధవళ భాస్కరరావు తెలిపారు. బుధవారం పొందూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పొందూరు పరిధిలో 230 కేసులు నమోదయ్యాయని చెప్పారు. క్షయ రోగులకు డాట్ ప్రొవైడర్ ద్వారా సేవలను అందిస్తున్నామని తెలిపారు. మొండి క్షయ బాధితులు 26 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్ఏ సురేష్ కుమార్ ఉన్నారు.
Advertisement
Advertisement