నిజామాబాద్‌ జిల్లాలో దారుణం | 12 years old girl set on fire at nizamabad district | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

Apr 24 2017 11:40 AM | Updated on Sep 5 2017 9:35 AM

నిజామాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది

బోధన్‌: నిజామాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పన్నెండేళ్ల బాలికపై గుర్తుతెలియని దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బోధన్‌ మండలం తెగడపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాలు.. గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(12) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో గట్టిగ కేకలు వేస్తూ బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement