లలితాదేవికి మహాభోగ నివేదన | Sakshi
Sakshi News home page

లలితాదేవికి మహాభోగ నివేదన

Published Sun, Oct 9 2016 10:47 PM

లలితాదేవికి మహాభోగ నివేదన

దుర్గాడ (గొల్లప్రోలు) : స్థానిక ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని లలితాదేవికి 108 రకాలతో తయారు చేసిన పిండివంటలతో మహాభోగ నివేదన చేశారు. గ్రామంలోని మహిళలు వీటిని తయారుచేసి ప్రసాదంగా అందజేశారు. ఆలయ పండితుడు చెరుకూరి వీరబాబు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆహారం, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని కోరుతూ ఈ భోగ నివేదన చేసినట్టు తెలిపారు. అమ్మవారికి సోమవారం పండ్లతో, మంగళవారం పూలతో అభిషేకం చేయనున్నట్టు చెప్పారు. 

Advertisement
Advertisement