నాట్స్ ముగింపు సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
లాస్ఏంజెలిస్ నుంచి సాక్షి ప్రతినిధి: ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతున్నాయని, త్వరలో అగ్రరాజ్యాల సరసన భారత్ నిలుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. శనివారం రాత్రి లాస్ఏంజెలిస్లో జరిగిన నాట్స్ ముగింపు సభలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ప్రధాని మోదీ పరిపాలన గురించి చెప్పుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని ‘‘ ఏబుల్ లీడర్- స్టేబుల్ గవర్నమెంట్’’ ఏర్పడిందని తెలిపారు. మోదీ 3డీ లాంటివాడని డైనమిక్, డెసిషన్, డెవలప్మెంట్ అనే భావంతో పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు. నాట్స్ చేస్తున్న సేవలను వెంకయ్య ప్రశంసించారు. నాట్స్ చేపట్టిన ‘‘ భాషే రమ్యం-సేవే గమ్యం’’ అనే నినాదం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని వెంకయ్య పేర్కొన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్తో పాటు తాను విశాఖలో కలసి చదవుకున్నానని, ఆయన చేతులమీదుగా నాట్స్ అవార్డును తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జీఎంఆర్తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, అమెరికా పారిశ్రామిక వేత్త డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, డాక్టర్ ఆలపాటి రవి, ఆచంట రవి, దేశు గంగాధర్, పాపుదేశి ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో అతిథులను అవార్డులతో సత్కరించారు. నాట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదాల రవిని వెంకయ్యనాయుడు సత్కరించారు. అనూప్రూబెన్స్ సంగీత విభావరి ఆకట్టుకుంది. 3 రోజుల నాట్స్ సభలను విజయవంతం చేసిన అందరికీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదాల రవి, ప్రస్తుత అధ్యక్షుడు ఆచంట రవి, సమావేశాల సమన్వయకర్త ఆలపాటి రవి కృతజ్ఞతలు తెలిపారు.
మోదీ పాలనను ప్రపంచం గమనిస్తోంది
Published Mon, Jul 6 2015 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement