Minister Venkaiah Naidu
-
అమ్మ ఫొటో లేకపోవడం లోటే
న్యూఢిల్లీ: ఫొటోలు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. 6వ జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వెంకయ్య బుధవారం ప్రముఖ ఫోటో జర్నలిస్టు రఘు రాయ్తో సహా పలువురికి జీవితకాల సాఫల్య పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకున్న వెంకయ్య భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా అమ్మను నా వయసు ఏడాదిన్నర ఉన్నప్పుడు కోల్పోయాను. ఆవిడ ఫోటో లేకపోవడం నాకెప్పుడూ లోటుగానే ఉంటుంది’ అని అన్నారు. 1984లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను కుట్రతో గద్దెదింపిన సమయంలో ఫోటోలు చేసిన సాయాన్ని వెంకయ్య గుర్తుచేశారు. ‘అప్పుడు మేము ఢిల్లీలో నిరసన ర్యాలీ నిర్వహిస్తే ఇక్కడుండే కొందరు వ్యక్తులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉన్నారని ప్రచారం చేశారు. అందుకోసం నకిలీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ఎమ్మెల్యేలంతా ఢిల్లీలోనే ఉన్నారని నిరూపించడానికి ఎల్.కె.అడ్వాణీ సలహా మేరకు రఘు రాయ్ సాయం తో ఫొటోలు తీసి గవర్నర్కు పంపించాం’ అని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. -
నగరాల రూపురేఖలు మార్చేస్తున్నాం
జియో స్పేషియల్ వరల్డ్ ఫోరమ్ సదస్సులో వెంకయ్యనాయుడు భవిష్యత్తుకు స్పేషియల్ టెక్నాలజీలే దన్ను నిర్మాణ అనుమతుల జారీ సరళతరం జియో ట్యాగింగ్తో వృథాకు అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ నేతృత్వం లో దేశంలోని నగర ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నా యని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మొద లుకొని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అమృత్ వంటి అనేక పథకాలు నగర ప్రాంతా ల రూపురేఖలను మార్చేస్తున్నా యన్నారు. సోమవారం హైదరాబాద్లో జియోస్పేషియ ల్ వరల్డ్ ఫోరమ్ అంతర్జా తీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రతి నగరం స్మార్ట్ సిటీగా మారేందుకు పోటీపడుతోం దని.. పట్టణ, నగర ప్రాంతాల్లో తిష్టవేసిన అనేక సమస్యలకు జియోస్పేషియల్ టెక్నాల జీలు వేగంగా పరిష్కారం చూపగలవని ఆయన చెప్పారు. ఈ రంగంలో దేశానికి రూ.50 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు జియోట్యాగింగ్.. మున్సిపాలిటీలు తమ ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు గమనించేందుకు జియో ట్యాగింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని, తద్వారా సిబ్బంది పనిచేస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వెంకయ్యనాయుడు సూచించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా కేంద్రం స్పాట్ యువర్ టాయిలెట్ పేరుతో ఓ యాప్ను అందుబాటు లోకి తేనుందని, దాని ద్వారా నగర ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఎక్కడెక్కడ అందు బాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చని తెలిపా రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకు జియోట్యాగింగ్ చేస్తున్నామని, తద్వారా ఇంటి నిర్మాణం నిజంగా జరిగిందీ లేనిదీ స్పష్టమవుతుందని చెప్పారు. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా కొత్త ఇళ్ల ఫొటోలను భువన్ సర్వర్తో అనుసం ధానించామని, తద్వారా ఎక్కడ ఏ ఇల్లు ఉందో స్పష్టంగా తెలిసిపోతుందని పేర్కొన్నా రు. నగరాల్లో భవన నిర్మాణాలు, ఇతర పనులకు అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేందుకు పౌర విమానయాన, రైల్వే, పర్యావరణ తదితర ఏడు శాఖలతో సంప్రదింపులు జరిపి ఏకీకృత విధానాన్ని తీసుకువస్తున్నామని వెంకయ్య వెల్లడించారు. నగరాల మ్యాపుల్లోనే నిర్మాణానికి అనుమ తుల అవసరం లేని ప్రాంతాలను స్పష్టంగా గుర్తిస్తామని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని నిర్ణీత సమయం తరువాత అనుమతి పొందినట్టుగానే భావించి నిర్మాణాలు చేపట్టవచ్చునని వివరించారు. రైతులకు తోడ్పాటు అవసరం.. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ప్రజలకు తమ భూములున్న సర్వే నంబర్లు కూడా తెలియవని, ఈ పరిస్థితి మారాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నామమాత్ర రుసు ము, ఆన్లైన్ దరఖాస్తుల తోనే భూమి రికార్డు లు రైతులకు అందు బాటులో ఉండేలా చేసేలా, వాటి ఆధారంగా బ్యాంకులు రుణా లు మంజూరు చేసేలా ప్రధాని మోదీ ప్రయ త్నం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ స్వర్ణ సుబ్బా రావు, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం అధ్యక్షుడు స్టీఫెన్ ష్వెనిఫెస్ట్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ప్రారంభం
విశాఖపట్నం: విశాఖపట్నంలో జాతీయస్థాయి అంతర్జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 400 జిల్లాలకు చెందిన 3,483 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. షాట్పుట్, జావెలిన్, లాంగ్జంప్, హైజంప్, డిస్క్త్రో, పోల్వాల్ట్ తదితర విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. కాగా మూడు రోజుల పాటు భారీ ఎత్తున ఉక్కు స్టేడియంలో ఈ మీట్ జరగనురంది. జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య సహకారంతో పోటీల నిర్వహణకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) సిద్ధమైంది. -
ఏపీని అన్ని విధాలా ఆదుకుంటాం
రూ.22 వేలకోట్లు రెవెన్యూలోటు భర్తీ కేంద్రానిదే బాధ్యత నెల్లూరులో ఎన్సీఈఆర్టీ త్వరలో ఏర్పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెంకటగిరి: రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను కేంద్రప్రభుత్వ అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకటగిరిలో ఆదివారం కృషివిజ్ఞానకేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ 14వ ఆర్థికసంఘం సూచనల మేరకు ప్రత్యేకహోదా కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాకన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనఽతో ఏర్పడిన రూ.22 వేలకోట్లు రెవెన్యూ లోటును కేంద్రప్రభుత్వం ఐదేళ్లలో భర్తీ చేసేందుకు అంగీకరించిందన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. దక్షణ భారత దేశంలో రెండోదిగా నెల్లూరులో ఎన్సీఈఆర్టీ ( నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రయినింగ్ సెంటర్ )కు త్వరలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. విజయవాడ నుంచి చెన్నై వరకూ ఉన్న డబుల్ రైల్వేలైన్ను ఆధునీకరించి ట్రిపుల్లైన్గా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కృషివిజ్ఞానకేంద్రం ద్వారా పరిశోధనలు జరిగి ఈ ప్రాంతానికి అనుకూలమైన పంటలు, సాగువిధానాలు రూపొందించే వీలుంటుందన్నారు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ కేంద్రన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు అదేప్రాంగణంలో పట్టణంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించిన సిమెంట్రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్రమంత్రులు పత్తిపాటి పుల్లారావు, పొంగూరు నారాయణ, కామినేని శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, డాక్టర్ వైఎస్సార్ ఉద్యానశాఖ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ బీఎంసీ రెడ్డి. కలెక్టర్ ముత్యాలరాజు పాల్గొన్నారు. -
బాలూ పాటకు ‘సెంటినరీ’!
‘‘సినిమా రంగంలో, ముఖ్యంగా సంగీత ప్రపంచంలోని అందరికీ ఈ అవార్డు చెందుతుంది. జన్మనిచ్చిన నా తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల భాగస్వామ్యం లేనిదే 50 ఏళ్లకు పైగా కొనసాగడం కష్టసాధ్యం. అన్నిటి కంటే మించి ఇప్పటికీ నా పాట వింటూ ఆశీర్వదిస్తూ ఇంతలా ఎదిగేలా చేసిన వారికి రుణపడి ఉంటాను’’ అని ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గోవా వేదికగా ఈ నెల 20 నుంచి 28 వరకూ జరగనున్న 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల (ఇఫీ) వేడుకలో ఎస్పీబీ 2016వ సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘ది సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ’ అవార్డును అందుకోనున్నారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని మంగళ వారం ప్రకటించారు. ఈ ప్రకటనకు ఎస్పీబీ తన స్పందన తెలియజేస్తూ - ‘‘ఎంతో మంది నిష్ణాతులు ఉండగా నాకు అవార్డు ప్రకటించడం ఆశ్చర్యమేసింది’’ అన్నారు. నాలుగు తరాలకు వంతెనలా... రెండేళ్ల క్రితం దక్షిణాదికి చెందిన రజనీకాంత్కు ఈ అవార్డును ప్రదానం చేశారు. మళ్లీ దక్షిణాదికి చెందిన మీకు రావడం పై మీ అభిప్రాయం? అనే ప్రశ్న ఎస్పీబీ ముందుంచితే - ‘‘అవార్డు రావడం ఆనంద దాయకం. దక్షిణాది పరిశ్రమపై ఎందుకో కొంత చిన్నచూపు ఉంది. దీన్ని విమర్శగా తీసుకోవద్దు. జనరల్గా జరుగుతోంది. నేను, ఇళయరాజా, రజనీకాంత్ గారూ అన్ని భాషల్లో పనిచేశాము. మేమంతా ప్రాంతీయతత్వాలకు అతీతమైన భారతీయ కళాకారులం’’ అన్నారు. గత 55 ఏళ్లుగా చిత్రరంగంలో ఉన్నారు, మీ దృష్టిలో ఏవి మంచి రోజులు? అనడిగితే - ‘‘కాలానికి అనుగుణంగా మార్పులు సహజం. నేను చిత్రరంగంలోకి ప్రవేశించిన రోజులు అపూర్వమైనవి. నా ముందు తరం వారు దేదీప్యమానంగా వెలిగిపోతున్న రోజులు. సినీరంగం లోకి వచ్చి, వారితో కలిసి పనిచేస్తూ ఎన్నో నేర్చుకున్నా. నాలుగు తరాలకు ఒక వంతెనలా కొనసాగుతూ నేటికీ పాడటం సంతోషకరం. నేను ఆస్వాదించింది 1975 నుండి 90 వరకు. ఆ 15 ఏళ్లు బెస్ట్’’ అన్నారు. మహారాష్ట్రలో, తమిళనాడులో ఉంది... మన దగ్గరే లేదు- సీవీ రెడ్డి గోవాలో జరగనున్న ‘ఇఫీ’లో భాగమైన ‘ఇండియన్ పనోరమ 2016’ ఈ నెల 21న ప్రారంభమవుతుంది. ఇండియన్ పనోరమ జ్యూరీ సభ్యులైన ప్రముఖ దర్శక, నిర్మాత సీవీ రెడ్డి మాట్లాడుతూ - ‘‘ఇండియాలో అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్నది హిందీ తర్వాత తెలుగు పరిశ్రమే. కానీ, అవార్డుల ఎంపిక కోసం తమ చిత్రాలను జ్యూరీకి పంపే విషయంలో తెలుగు పరిశ్రమ బాగా వెనక బడింది’’ అన్నారు. ‘‘మంచి చిత్రాలు తీసినవారికి మహారాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు, కన్నడ, తమిళ ప్రభుత్వాలు 20 లక్షల చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తున్నాయి. కానీ, తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి చిత్రాలకు ఎలాంటి ప్రోత్సాహకాలూ ఇవ్వడం లేదు. తెలుగు ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహ కాలు, సబ్సిడీలు ఇస్తే ఇక్కడా మరిన్ని ఉత్తమ చిత్రాలు వస్తాయి’’ అన్నారు. -
రామాయపట్నం పోర్టు నిర్మించాలి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కోరిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి: రామాయపట్నంలో పోర్టు, షిప్యార్డు నిర్మించాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడును కోరారు. బుధవారం వెంకయ్యనాయుడు కార్యాలయంలో కలిసి కావలి నియోజకవర్గం అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే చర్చించే సమయంలో మొన్నటి వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉండి ప్రస్తుతం వెంకయ్యనాయుడు పీఎస్గా విధులు నిర్వహిస్తున్న జానకి అక్కడే ఉండి ఎమ్మెల్యే చెబుతున్న విషయాలకు మద్దతుగా మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం పథకమైన అమృత్కు సంబంధించి కావలి మున్సిపాల్టీకి నిధులు మంజూరు, అవి సద్వినియోగం పట్టణ ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పించే విషయమై ఎమ్మెల్యే మంత్రితో చర్చించారు. పోర్టు నిర్మిస్తే కావలి తోపాటు నెల్లూరు,ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, దగదర్తి వద్ద వున్న కిసాన్ సెజ్లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సెజ్లో స్థానికులకు కాకుండా ఇతర రాష్ట్రాల ఉపాధి కల్పిస్తుండటంతో స్థానికులు అసంతృప్తిగా ఉన్నారని వివరించారు. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు, కావలి మున్సిపాల్టీలో నిధులు దుర్వినియోగంపై విచారణ జరపాలని కోరారు. ఈ విషయాలపై పీఎస్ జానకి ని పరిశీలించాలని మంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. -
విభజన అంశాలన్నీ అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశాన్నీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని సూచించారు. కొన్ని సాంకేతిక, న్యాయపరమైన కారణాలతో కొన్ని అంశాల విషయంలో కాస్త ఆలస్యమైనా ఓపిక పట్టాలని ఆయన కోరారు. సోమవారం హైదరాబాద్లో తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూడాలని, భౌతికంగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రాంతాలుగా మానసికంగా ఏపీ-తెలంగాణ ఒక్కటేనన్నారు. ఈ రెండింటి మధ్య సుహృద్భావ వాతావరణానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవచూపాలన్నారు. రాష్ట్ర విభజన లక్ష్యం నెరవేరాలంటే సోదర భావంతో మెలగాల్సి ఉంటుందన్నారు. తమిళనాడు-కర్ణాటక మధ్య చోటుచేసుకున్న ‘కావేరి’ వివాదాల్లాంటివి దేశానికి మంచిది కాదన్నారు. ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా ప్రతి రాష్ట్రం ఓ తపాలా సర్కిల్గా ఉన్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు విడివిడి సర్కిళ్లు ఏర్పాటవుతున్నాయని, ఇందులో సోమవారం నుంచి తెలంగాణ సర్కిల్ అమల్లోకి వచ్చిందన్నారు. వచ్చే నెలలో బీఎస్ఎన్ఎల్ కూడా రెండు సర్కిళ్లుగా రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ఉంటుందన్నారు. కాగా, వందశాతం ఈక్విటీతో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయని, వచ్చే సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్సిన్హా ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాల సంఖ్య 3 కోట్ల వరకు పెరిగాయన్నారు. కార్మికుల సామాజిక భద్రత పథకాల అమల్లో తపాలాశాఖ పాత్ర కీలకమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దత్తాత్రేయ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్, రీజినల్ పోస్ట్ మాస్టర్ జనరల్ (హైదరాబాద్) కల్నల్ ఎం. ఎలీషా, తపాలా అధికారులు పాల్గొన్నారు. మగవారికీ ప్రసూతి సెలవు పెంచాలి... మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను ఇటీవల 26 వారాలకు పెంచిన నేపథ్యంలో పురుష ఉద్యోగులకూ ప్రసూతి సెలవులను పెంచడం సమంజసంగా ఉంటుందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ప్రసవించిన భార్యకు సహాయకంగా భర్త ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు. ‘హిందీ’పై తారు పూసినందుకు బాధపడ్డా తమిళనాడులో గతంలో హిందీ వ్యతిరేక ఆందోళన జరిగినప్పుడు నెల్లూరులో తాను యువ నాయకుడిగా పాల్గొన్నానని, ఆ సందర్భంగా తపాలా కార్యాలయం, రైల్వేస్టేషన్లలో గోడలపై ఉన్న హిందీ అక్షరాలపై తారు పూశానని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. కానీ తాను ఎంపీ అయ్యాక జాతీయ భాష హిందీ ప్రాధాన్యం తెలుసుకుని ఆ ఘటనకు చింతించానని, హిందీ అక్షరాలపై తారు పూయటమంటే మన ముఖానికి పూసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. ‘భారత మాతకు జై’పై అభ్యంతరమెందుకు? మా తుఝే సలామ్ అర్థంలో భారత మాతాకుజై అనడంపై కొందరికి అభ్యంతరమెందుకో అర్థం కావటం లేదని వెంకయ్య అన్నారు. సైనికులను విమర్శించేందుకు ఆసక్తి చూపే కొందరికే ఇలాంటి అభ్యంతరాలొస్తున్నాయని, 3 రోజుల క్రితం ప్రధాని కీలక ప్రసంగాన్ని లోపలి పేజీల్లో ప్రచురించిన కొన్ని పత్రికలు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రసంగాన్ని మొదటి పేజీలో ప్రచురించటం కూడా ఈ కోవలోకే వస్తుందన్నారు. -
కేంద్రమంత్రి ఇంటి ముట్టడికి యత్నం
విద్యార్థి సంఘాలను అడ్డుకున్న పోలీసులు.. పటేల్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన నాయకులు నెల్లూరు(బారకాసు) : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి ఇంటిని ముట్టడించేందుకు వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఎన్ఎస్యూఐ సంఘాల నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరులో చోటుచేసుకుంది. తొలుత స్థానిక రెండు సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి కరెంటాఫీస్సెంటర్ నుంచి వెంకయ్య ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాయకులు పోలీసులను దాటుకుని వెళ్లే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం నాయకులు, విద్యార్థులు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. కొంతసేపు నినాదాలు చేశారు. అనంతరం సమీపంలో ఉన్న సర్ధార్ వల్లభాయ్పటేల్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సిగ్గుచేటు ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్కుమార్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కేశవ నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా 15సంవత్సరాలు తీసుకొస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు హోదాతో ఎటువంటి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తుంగలో తొక్కిన చంద్రబాబు, నరేంద్రమోదీలను శాశ్వతంగా ఇంట్లో కూర్చోపెడతామన్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర పార్టీలు పోరాటం చేస్తుంటే అధికార పార్టీ తమ స్వార్థం కోసం డ్రామాలాడుతోందని ఆరోపించారు. విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి కాపు హరికృష్ణయాదవ్, నగర ప్రధాన కార్యదర్శులు టి.వినీల్, చరణ్తేజ, నిఖిల, సుమంత్, ఎన్ఎస్యూఐ నగరాధ్యక్షుడు మొమిత్షా, మహేష్, నవీన్, సమీర్, నజీర్ పాల్గొన్నారు. -
స్వర్ణభారత్ సేవలు ఆనందదాయకం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంకటాచలం : పదవులున్నా లేకున్నా స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలు ఆనందదాయకమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య, ఉపాధి శిక్షణ రంగాల్లో సేవలందించడం మహానందాన్ని కలుగజేస్తాయన్నారు. ఎంత బిజీగా ఉన్నా.. టెన్షన్లో ఉన్నా స్వర్ణభారత్ ట్రస్ట్లో ఒక్కరోజు గడిపితే నూతన ఉత్సాహం వస్తుందన్నారు. ప్రభుత్వంలో ఉండి సేవ చేస్తే కేవలం ఆనందం మాత్రమే కలుగుతుందన్నారు. ప్రభుత్వాలు అన్నీ పనులు చేయలేవని, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు సామాజిక చింతన ఉన్న వ్యక్తులు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇంకా 24 శాతం దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నారన్నారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో భారత్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కృషికి అందరూ భాగస్తులు కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణభారత్ లాంటి స్వచ్ఛందసేవా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఆసక్తి చూపాలని కోరారు. కన్నతల్లిని, జన్మభూమిని ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ భేటీ బచావో..(ఆడ పిల్లలను రక్షించు) భేటీ పడావో.. (ఆడ పిల్లలను చదివించు) అనే నినాదాలతో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నామని, ఇప్పుడు భేటీ బడావో..(ఆడ పిల్లలను పెంచు) నినాదాలను ఆచరణలో చూపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు నిదర్శనం దీపా వెంకట్, రజత విజేత పీవీ సింధూ అని తెలిపారు. సమగ్ర అభివృద్ధికి వెంకయ్యనాయుడు దూరదృష్టి స్ఫూర్తిదాయకమన్నారు. పెట్రోలియం సహజవనరులశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కృష్ణ గోదావరి బేసిన్లో అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయన్నారు. ఆయిల్ రీఫైనరీ విస్తరణ, పెట్రో మెడికల్ క్యాంపస్, పెట్రోలియం యూనివర్సిటీ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలంపిక్ రజత పతక విజేత సింధూలు స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలను కొనియాడారు. తొలుత ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బ్రిడ్జి స్కూల్, రైతు శిక్షణ కేంద్రం, వివిధ ఉపాధి శిక్షణ కోర్సులను అతిథులకు మంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. 15వ వార్షికోత్సవ సావనీర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన దక్షణ భారతదేశ సంస్కృతి, కళల నృత్యరూపకాలు అలరించాయి. అతిథులకు ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్రావు, గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కలెక్టర్ ముత్యాలరాజు, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, సభ్యులు అట్లూరి అశోక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నమూనా ఇళ్ల నిర్మాణం
3న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభం కలెక్టర్ ముత్యాలరాజు వెంకటాచలం: మండలంలోని చౌటపాళెం పంచాయతీలోని సరస్వతీనగర్లో బిల్డింగ్ మెటీరియల్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్(బీఎంటీపీసీ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మోడల్ హౌస్ సముదాయాన్ని సెప్టంబర్ 3న కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు చేతులుమీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. మోడల్ హౌస్ సముదాయాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.4.55కోట్లతో మొత్తం 36 ఇళ్లను సముదాయంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. జీఎఫ్ఆర్జీ సిస్టంతో నిర్మిస్తున్న ఇళ్లను 36 మంది లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పారు. అలాగే ప్రాంగణంలో రూ.73.4లక్షలతో కమ్యూనిటీహాలు, మరో రూ.72.4లక్షలతో ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కలెక్టర్ వెంట బీఎంటీపీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శైలేష్ అగర్వాల్, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, తహసీల్దార్ సుధాకర్, తదితరులు ఉన్నారు. హెలిప్యాడ్ పరిశీలన వెంకటాచలం మండలానికి సెప్టంబర్ 3,4 తేదీల్లో ప్రముఖులు రానున్నారు. 3న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, 4న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రియో ఒలింపిక్స్ రజక పతక విజేత పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల్ల గోపిచంద్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు రానున్నారు. స్వర్ణభారత్ట్రస్ట్, అక్షర విద్యాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వెంకటాచలంలోని క్యూబా కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాట్లను కలెక్టర్ ముత్యాలరాజు పరిశీలించారు. -
పట్టణాల్లో చెత్త వేస్తే జరిమానా!: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: పట్టణాల్లోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వే స్తే జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. స్వచ్ఛ్ భారత్లో ప్రజల భాగస్వామ్యంపై ‘స్కేలింగ్ అప్ సిటిజెన్స్’ పేరిట జరిగిన వర్క్షాప్ను మంగళవారం ఢిల్లీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. మిషన్లో దేశ ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసే పద్ధతులపై వర్క్షాప్లో చర్చిస్తామని చెప్పారు దేశ భద్రత విషయంలో అన్ని పార్టీలూ ఒకే గొంతుకగా వ్యవహరించాలని, కానీ కాంగ్రెస్ అలా వ్యవహరించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని, పాక్ ఆక్రమిత కశ్మీర్, బెలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతోందో ప్రపంచానికి తెలియాలన్నారు. -
జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వండి
వైఎస్సార్సీపీని కోరిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో మద్దతివ్వాలని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కోరారు. మంగళవారం ఈ మేరకు పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలతో ఆయన చర్చించారు. జీఎస్టీ బిల్లుపై మద్దతుకోసం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి సూచించారని, అందులో భాగంగా మద్దతు కోరుతున్నామని వెంకయ్యనాయుడు వైఎస్సార్సీపీ ఎంపీలకు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లుకు తాము మద్దతు పలుకుతామని హామీఇచ్చినట్టు ఎంపీలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యం: మేకపాటి ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో రానున్న ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలిపే అంశంపై మేకపాటి రాజమోహన్రెడ్డి సానుకూలంగా స్పందిం చారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఈ అంశంపై అనేకమార్లు దీక్షలు, ధర్నాలు చేశారని, ప్రత్యేకహోదా వస్తే తప్ప ఏపీకి భవిష్యత్తు లేదన్నదే తమ భావనని ఆయన వివరించారు. ‘‘బిల్లు ఎవరు పెట్టారన్నది ముఖ్యం కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం ముఖ్యం’’ అని మేకపాటి అన్నారు. -
వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి మార్గదర్శకాలు
విడుదల చేసిన మంత్రి వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో వృద్ధులు, వికలాంగులు ఎటువంటి అడ్డంకుల్లేకుండా సులభంగా వెళ్లడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా రూపొందించిన మార్గదర్శకాలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారమిక్కడ విడుదల చేశారు. కొత్తగా నిర్మించే ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో వృద్ధులు, వికలాంగులు లిఫ్ట్లు, మెట్లు, వీల్చెయిర్పై వెళ్లడానికి వీలుగా తగిన మార్పులు చేయడం ఆయా పట్టణ ప్రణాళికలో, భవన నిర్మాణంలో ఒక భాగం కావాలనేది ఈ మార్గదర్శకాల ఉద్దేశమని వివరించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా ఆమోదించి స్థానిక సంస్థలకు సిఫార్సు చేయాలన్నారు. పట్టణ గణాంకాలతో కూడిన కరదీపికను ఆయన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పట్టణాలకు సంబంధించిన పూర్తి గణాంకాలు, ఆయా పట్టణాల్లో ఉన్న రహదారులు, నీటిసౌకర్యం, పారిశుద్ధ్యం, హౌసింగ్, విద్యాసంస్థలు తదితర వివరాల సమగ్ర దర్శిని ఇదన్నారు. దీన్ని రాష్ట్రప్రభుత్వాలు కిందిస్థాయివరకూ తీసుకెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం వద్దు ‘వర్సిటీల్లో రాజకీయం జోక్యం ఉండరాదు. దయచేసి రాజకీయ నేతలు వర్సిటీల వాతావరణాన్ని కలుషితం చేయవద్దు. ఆ విశ్వవిద్యాలయంలో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, పరిపాలనా మండలి ఆ విషయాల్ని సరిచూసుకోగలరు’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. హెచ్ సీయూలో జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ పర్యటన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొందన్న వార్తలపై మంత్రి స్పందిస్తూ..రోహిత్ ఆత్మహత్య ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిదని, అది పూర్తవాల్సి ఉందని చెప్పారు. ఎవరూ హింసకు పాల్పడకూడదని, చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదని సూచించారు. రాజకీయ అవసరాలకోసం విశ్వవిద్యాలయాల వాతావరణాన్ని కలుషితం చేయకూడదని తాను అందర్నీ కోరుతున్నానన్నారు. -
‘రియల్’ బిల్లుకు ఆమోదం
రాజ్యసభలో గట్టెక్కిన బిల్లు ♦ పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యం ♦ మోసానికి పాల్పడితే జైలు శిక్ష ♦ ట్రిబ్యునళ్ల ద్వారా 60 రోజుల్లో ఫిర్యాదుల పరిష్కారం న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రియల్ ఎస్టేట్ బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు, 2015’ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సభలో ప్రవేశపెట్టారు. విపక్ష కాంగ్రెస్ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందింది. స్థిరాస్తిరంగ నియంత్రణ, పారదర్శకత, జవాబుదారీతనానికి ఉద్దేశించిన ఈ బిల్లులో వినియోగదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేసినట్లు వెంకయ్య తెలిపారు. బిల్లుపై ఆయన తెలిపిన మరిన్ని వివరాలు.. ♦ వినియోగదారుల డబ్బులో 70% చెక్కుల ద్వారా ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి కాబట్టి రియల్రంగంలోకి నల్లధనాన్ని ఈ బిల్లు నిరోధిస్తుంది. ♦ అన్ని అనుమతుల కోసం సింగిల్ విండో విధానం ఉంటుంది. ♦ రాష్ట్రాల స్థాయిలో నియంత్రణ సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. తద్వారా గృహ, వాణిజ్య రంగ ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడొచ్చు. ♦ డెవలపర్లు తమ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలను నియంత్రణ సంస్థలకు అందించాలి. ప్రమోటర్ల వివరాలు, భూ వివరాలు, ప్రాజెక్ట్ లేఔట్, అనుమతులు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, ఏజెంట్ల వివరాలు.. అందులో ఉండాలి. ♦ అప్పీలేట్ ట్రిబ్యునళ్లు ఫిర్యాదు అందిన 60 రోజుల్లోగా కేసులను పరిష్కరించాలి. ♦ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రమోటర్లకు మూడేళ్లు, ‘రియల్’ఏజెంట్లు, కొనుగోలుదార్లకు ఏడాది జైలు శిక్ష ఉంటుంది. ♦ ఈ బిల్లు ఎవరినీ ఇబ్బందిపెట్టేందుకు ఉద్దేశించినది కాదు. బిల్డర్లపై వేధింపులు ఉండవు. ‘రియల్’ రంగాన్ని నియంత్రించేం దుకే దీన్ని రూపొందించాం. కొనుగోలుదారులను మోసంచేయడం నేరం. హెచ్చరికలు, జరిమానాల తరువాతే.. జైలుశిక్ష ఉంటుంది. ♦ పెట్టుబడిదారుల విశ్వాసం పొందడం ద్వారా ప్రభుత్వ పథకమైన ‘అందరికీ గృహ వసతి’ని విజయవంతం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ♦ వ్యవసాయ రంగం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది స్థిరాస్తి రంగమే. బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ.. అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఈ బిల్లు పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ సభ్యురాలు కుమారి షెల్జా కోరారు. ఈ బిల్లు ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి వినియోగదారుడికి ప్రయోజనం లభిస్తుందని బిల్లు ను అధ్యయనం చేసిన స్థాయీసంఘానికి నేతృత్వం వహించిన అనిల్ మాధవ్ దవే(బీజేపీ) తెలిపారు. సామాజిక పథకాలకు కోత: కాంగ్రెస్ కేంద్ర బడ్జెట్లో సామాజిక పథకాలకు నిధులు తగ్గించారని, ఆహార, ఎరువుల రాయితీలకు కోతపెట్టారంటూ సర్కారుపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ గురువారం లోక్సభలో బడ్జెట్పై చర్చను ప్రారంభిస్తూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించి దేశంలో ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న మోదీ హామీ ఎప్పుడు నెరవేరుతుందంటూ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని తప్పుబట్టారు. 2011 నుంచి 2016 వరకు.. జూలై 2011: రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణకు ఒక కేంద్ర చట్టం అవసరమని న్యాయశాఖ ప్రతిపాదన. 2013: జూన్లో రియల్ ఎస్టేట్ బిల్లు, 2013కు నాటి కేంద్ర కేబినెట్ ఆమోదం, ఆగస్ట్లో రాజ్యసభలో బిల్లు, సెప్టెంబర్లో స్థాయీ సంఘానికి నివేదన. 2015: ఫిబ్రవరిలో రాజ్యసభ, లోక్సభల్లో స్థాయీసంఘం నివేదిక, ఏప్రిల్లో స్థాయీసంఘం సిఫారసుల ఆధారంగా రూపొందించిన అధికారిక సవరణలకు కేబినెట్ ఆమోదం. మేలో రాజ్యసభ స్థాయీసంఘం ముందుకు ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2013’, అధికారిక సవరణలు. జూలైలో ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2015’తో పాటు తన నివేదికను సభకు సమర్పించిన స్థాయీసంఘం. డిసెంబర్లో ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2015’కు కేబినెట్ ఆమోదం. రాజ్యసభలో బిల్లు. 2016: మార్చి 10న రాజ్యసభ ఆమోదం. -
బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లండి
బీజేపీ ఎంపీలకు పార్టీ అధిష్టానం ఆదేశం న్యూఢిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... బీజేపీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తాజా కేంద్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రయోజనాలు ఉన్నాయని వారికి వివరించాలని తమ ఎంపీలకు పార్టీ అధిష్టానం ఆదేశించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు ఎంపీలకు సూచనలు చేశారు. భేటీ అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. ఎంపీలు ప్రస్తుత బడ్జెట్లోని పథకాలు, క్షేత్రస్థాయిలో ప్రయోజనం కలిగించే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సూచించారని చెప్పారు. ముఖ్యంగా ‘సబ్కా సాత్-సబ్కా వికాస్’లో ప్రజలంతా భాగస్వాములయ్యేలా అవగాహన కల్పించాలని, ‘ప్రధాని ఫసల్ బీమా యోజన, ముద్రా బ్యాంక్, గ్రామీణ విద్యుదీకరణ పథకం, జన్ధన్ యోజన’లను విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నట్లు తెలిపారు. -
దేశాభివృద్ధే మా ధ్యేయం
అఖిలపక్షంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం దేశ అభివృద్ధికి, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 26 పార్టీలకు చెందిన 40 మంది నేతలు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇటీవలి పరిణామాలపై పార్లమెంటులో లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య ఉభయ సభలకు చెందిన వివిధ పార్టీల నేతలకు హామీ ఇచ్చారు. జేఎన్యూ, హెచ్సీయూ సంఘటనలు, రిజర్వేషన్ల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ప్రధాన బిల్లులైన జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులు ఆమోదం పొందేందుకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ బిల్లుల ఆమోదంలో తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, అయితే తాము లేవనెత్తే అంశాలపై సమగ్ర చర్చ జరగాలన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి కోరారు. పంచాయతీ రాజ్ వ్యవహారాలపై రాజ్యసభ కమిటీని రాజ్యసభ ఛైర్మన్ అన్సారీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా కేశవరావు(టీఆర్ఎస్), గరికపాటి మోహన్రావు(టీడీపీ), జైరాం రమేశ్(కాంగ్రెస్)లను నామినేట్ చేశారు. ప్రతిపాదించిన ఎజెండా.. 25న ప్రశ్నోత్తరాలు ముగిశాక రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు.29న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. చర్చ, ఆమోదానికి ఉన్న బిల్లులు.. ► ఆర్థిక బిల్లు, 2016. 8 ఎనిమీ సంపత్తి(సవరణ, క్రమబద్ధీకరణ) బిల్లు.(ఆర్డినెన్స్ స్థానంలో). 8ది రీజనల్ సెంటర్ ఫర్ బయో-టెక్నాలజీ బిల్లు.8ఎన్నికల చట్టాలు(సవరణ) బిల్లు, 2016 లోక్సభలో పెండింగ్లో ఉన్నవి.. ► లోక్పాల్, లోకాయుక్త, సంబంధిత ఇతర చట్టాలు(సవరణ) బిల్లు, 2014 లోక్సభ ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్లో ఉన్నవి ► రాజ్యాంగ(నూటా ఇరవై రెండో సవరణ) బిల్లు, 2014-(జీఎస్టీ బిల్లు) ► ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిల్లు, 2015. 8 పరిశ్రమల(అభివృద్ధి, నియంత్రణ) బిల్లు, 2015 ► వినియోగ చట్టాలు(రద్దు) బిల్లు, 2015 ► జాతీయ జల మార్గాల బిల్లు, 2015 ► విజిల్ బ్లోయర్స్ రక్షణ (సవరణ) బిల్లు ► హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల(వేతనాలు, సర్వీసు షరతులు) సవరణ బిల్లు, 2015 రాజ్యసభలో పెండింగ్లో ఉన్న బిల్లులు ► రియల్ ఎస్టేట్(నియంత్రణ, అభివృద్ధి) బిల్లు, 2013 ► హైజాకింగ్ వ్యతిరేక బిల్లు, 2014 కొత్తగా ప్రవేశపెట్టబోయే బిల్లులు ► రాజ్యాంగ(షెడ్యూలు కులాలు) ఉత్తర్వులు(సవరణ) బిల్లు.8 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బిల్లు. -
‘స్మార్ట్’గా చెయ్యిచ్చిన కేంద్రం
తొలివిడత 20 స్మార్ట్సిటీల జాబితాలో తెలంగాణకు దక్కని చోటు సాక్షి, హైదరాబాద్: స్మార్ట్సిటీల ఎంపికలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. ఈ పథకం కింద తొలివిడతగా వివిధ రాష్ట్రాల నుంచి 20 నగరాలను ఎంపిక చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో ప్రకటించారు. కానీ ఆ జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క నగరానికి కూడా చోటు దక్కలేదు. తొలివిడతలో ఎంపిక కోసం రాష్ట్రం నుంచి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలు ‘స్మార్ట్సిటీ చాలెంజ్’లో పోటీపడ్డాయి. ఈ పథకం కింద ఎంపికయ్యే నగరాల్లో అభివృద్ధి కోసం కేంద్రం ఐదేళ్ల పాటు ఏటా రూ.200 కోట్లు ఇస్తుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ఆ నిధులు ఏ మూలకూ సరిపోవని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... స్మార్ట్సిటీ చాలెంజ్ నుంచి హైదరాబాద్ను ఉప సంహరించుకుని, కరీంనగర్ నగరాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు నెల రోజుల కింద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. దీంతో కేంద్రం హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్సిటీ చాలెంజ్ నుంచి తప్పించగా... రాష్ట్రం నుంచి వరంగల్ నగరం ఒక్కటే పోటీలో నిలబడింది. చివరకు గురువారం ప్రకటించిన తొలివిడత నగరాల జాబితాలో వరంగల్ పేరు గల్లంతయింది. దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక కానున్న నగరాల సంఖ్యను గతేడాదే కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలను, తెలంగాణ నుంచి రెండు నగరాలను మాత్రమే ఎంపిక చేస్తామని తెలిపింది. దీనిపై అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిరసన తెలిపాయి. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై విమర్శలు కూడా గుప్పించారు. అయినా కేంద్రం స్పందించలేదు. తాజాగా ప్రతిపాదనలో ఉన్న ఒక్క వరంగల్ నగరానికి కూడా తొలిజాబితాలో చోటుదక్కలేదు. చాలెంజ్పై అనుమానాలు స్మార్ట్సిటీ చాలెంజ్లో పాల్గొన్న నగరాలకు కేంద్రం ‘100 పాయింట్ల’ పరీక్ష పెట్టింది. ఆయా నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలకు 25 పాయింట్లు, సంస్థాగత నిర్మాణం/సామర్థ్యానికి 15 పాయింట్లు, స్వీయ ఆర్థిక సామర్థ్యాని(సెల్ఫ్ ఫైనాన్సింగ్)కి 30 పాయింట్లు, గత ట్రాక్ రికార్డు, సంస్కరణల అమలుకు 30 పాయింట్లు కలిపి మొత్తం 100 పాయింట్లకు ఈ చాలెంజ్ను నిర్వహించింది. 100 పాయింట్లలో ఎక్కువ పాయింట్లు సాధించే నగరాలను ఎంపిక చేస్తామని పేర్కొం టూ అప్పట్లో మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ చాలెం జ్లో తెలంగాణలోని రెండో అతి పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్ నెగ్గకపోవడంపై రాష్ట్ర అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు సంతృప్తికరంగా వరంగల్ నగర ప్రతిపాదనలను సమర్పించామని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అయినా ఎంపిక చేయకపోవడం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. -
‘స్మార్ట్’గా చెయ్యిచ్చిన కేంద్రం
-
పాయింట్ తేడాతో వరంగల్ మిస్
* ఏప్రిల్ 15 వరకు సవరించిన ప్రతిపాదనలిస్తే పరిశీలిస్తాం: వెంకయ్య * రూ. 50,802 కోట్లతో ఐదేళ్లలో స్మార్ట్ సిటీలు రెడీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘స్మార్ట్ సిటీ’లకు మరో అడుగు పడింది. తొలివిడతలో స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనున్న 20 నగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో.. ఏపీ నుంచి విశాఖ, కాకినాడ నగరాలకు స్థానం దక్కింది. తెలంగాణాలోని నగరాలకు అవకాశం దక్కలేదు. ఒక్క పాయింట్ తేడాతో వరంగల్ టాప్-20 జాబితాలో స్థానం కోల్పోయింది. ‘ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఒక్కో నగరానికి తొలి జాబితాలో స్థానం కల్పించాలనేది మా ఉద్దేశం. ఈ జాబితాలో అవకాశం దక్కని రాష్ట్రాలకు ఫాస్ట్ ట్రాక్ పోటీలో పాల్గొనడానికి మరొక అవకాశం ఇస్తాం. ఆయా రాష్ట్రాలు టాప్ ర్యాంకింగ్ నగరాల స్మార్ట్ సిటీ ప్రతిపాదనలను ఆధునీకరించి ఏప్రిల్ 15 లోగా పంపిస్తే ఈ మిషన్లో చేరుస్తాం’ అని వెంకయ్యనాయుడు తెలిపారు. తొలిజాబితాలోని 20 నగరాలను రూ. 50,802 కోట్లతో ఐదేళ్ల లోపు స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామన్నారు. స్మార్ట్ సిటీల తొలి జాబితాలో విశాఖకు 8వ స్థానం, కాకినాడకు 14వ స్థానం దక్కింది. స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాలని వివిధ రాష్ట్రాలనుంచి 97 ప్రతిపాదనలు అందాయన్న కేంద్ర మంత్రి ఈ జాబితా ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందని వెల్లడించారు. నగరాల్లో సమీకృత పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, సరైన రవాణా వ్యవస్ధ, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక సదుపాయాలు, చెత్త నిర్వహణ, స్వచ్ఛమైన నీరు, అందరకీ ఇళ్లు, పరిపాలనా సౌలభ్యంపైనే దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ పోటీయుత వాతావరణంలో గెలిచి.. టాప్-20లో స్థానం సంపాదించిన నగరాలకు ప్రధాని మోదీ, వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. సివిల్ సర్వీస్ పరీక్షలకున్నంత పోటీ ఈ తొలి జాబి తాలో చోటు దక్కించుకునేందుకు నగరాలు, రాష్ట్రాల మధ్య కనిపించిందని.. మోదీ అన్నారు. రెండో విడతలో 54 నగరాల ఎంపిక కోసం ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి పోటీ మొదలవుతుందని వెంకయ్య తెలిపారు. ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసితోపాటు ఉత్తరప్రదేశ్నుంచి ఒక్క నగరానికి కూడా తొలి జాబితాలో చోటు దక్కలేదు. అయితే డెహ్రాడూన్ను ఈ జాబితాలో చేర్చకపోవటం కేంద్రం వివక్షకు అద్దం పడుతుందని కాంగ్రెస్ విమర్శించింది. కాగా, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఈ పథకం కోసం ప్రతిపాదనలు పంపకపోవటాన్ని ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆక్షేపించారు. ఎంపిక విధానం రాష్ట్రాలు పంపిన స్మార్ట్ సిటీల ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం.. వివిధ ప్రామాణికాల ఆధారంగా తొలిజాబితాను రూపొందించారు. వ్యయ సాధ్యతతో కూడిన అమలు విధానానికి 30 శాతం, ఫలితాల లక్ష్యానికి 20 శాతం, ప్రజల భాగస్వామ్యానికి 16 శాతం, వినూత్నమైన ప్రతిపాదనలకు 10 శాతం, వ్యూహాత్మక ప్రణాళికకు 10 శాతం, విజన్, లక్ష్యాలకు 5 శాతం, సాక్షాధాన ప్రొఫైలింగ్, కీలక పనితీరు సూచికలకు 5 శాతం, అనుసరించిన విధానాలకు 4 శాతం మార్కులు వేశారు. రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలతోపాటు.. కేంద్రం, విదేశీ ప్రతినిధులు వచ్చి ఆయా నగరాలను పరిశీలించి నివేదికలు సమర్పించారు. వీటి ఆధారంగానే తొలిజాబితా రూపొందింది. తొలి జాబితాలోని స్మార్ట్ సిటీలు భువనేశ్వర్ (ఒడిశా), పుణే, షోలాపూర్ (మహారాష్ట్ర), జైపూర్, ఉదయపూర్ (రాజస్తాన్), అహ్మదాబాద్, సూరత్ (గుజరాత్), కొచ్చి( కేరళ), జబల్పూర్, ఇండోర్, భోపాల్ (మధ్యప్రదేశ్), విశాఖపట్నం, కాకినాడ (ఏపీ), దావణగెరే, బెల్గావి (కర్ణాటక), న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, కోయంబత్తూర్, చెన్నై (తమిళనాడు), గువాహటి (అసోం), లూథియానా (పంజాబ్) -
గ్రేటర్ షో
మా హయాంలోనే అభివృద్ధి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆల్విన్కాలనీ: కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్లో అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ చేసిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కూకట్పల్లి, వివేకానందనగర్, ఆల్విన్కాలనీ, గౌలిపురా డివిజన్లలో మంగళవారం నిర్వహించిన రోడ్షోల్లో ఆయన పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధినే టీఆర్ఎస్ నాయకులు వారు చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలు చేసేవారికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కూకట్పల్లి డివిజన్ అభ్యర్థి కూన అమ్రేష్గౌడ్, వివేకానందనగర్ డివిజన్ అభ్యర్థి విద్యాకల్పన, ఆల్విన్కాలనీ అభ్యర్థి నర్సింహా యాదవ్లను గెలిపించాలని కోరారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, రవికుమార్ పాల్గొన్నారు. అభివృద్ధిలో సగం వాటా మాదే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చంపాపేట: టీఆర్ఎస్ చేసిన నగరాభివృద్ధిలో సగం వాటా తమకే దక్కుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా సగం ఉందని పేర్కొన్నారు. చంపాపేట చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. 2020 నాటికి అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. భాగ్యనగర అభివృద్ధికి మజ్లిస్ అరాచక శక్తులు అడ్డుతగులుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు, దానికి మద్దతిస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇతర పార్టీల ప్రగల్భాలు, ప్రచార ఆర్భాటాలకు లొంగకుండా స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న చంపాపేట బీజేపీ అభ్యర్థి వంగా మధుసూధన్రెడ్డికే ఓటేయాలని కోరారు. భాగ్యనగర అభివృద్ధికి మజ్లిస్ అరాచక శక్తులు అడ్డుతగులుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు, వారికి మద్దతిస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి అభివృద్ధి చేశాం.. ఇంకా చేస్తాం మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్జోన్ బృందం: టీఆర్ఎస్ ప్రభుత్వం 18 నెలల్లోనే నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, ఎన్నో విదేశీ పెట్టుబడులను తెచ్చిందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్లో అధికారం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. నాగోలు, మన్సూరాబాద్, హయత్నగర్, వనస్థలిపురం, బీఎన్రెడ్డి నగర్, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ, గడ్డిఅన్నారం డివిజన్లలో మంగళవారం నిర్వహించిన రోడ్షోల్లో ఆయన పాల్గొన్నారు. నగరాభివృద్ధికి తమకు ఒక్క అవకాశమివ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పడి ఏడాది కాకుండానే విద్యుత్ కోతలు లేకుండా చేశామని, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పేదలందరికీ ఇళ్లు హైదరాబాద్లోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని, ఈ ఏడాది 10 వేలు, 2017లో 25వేలు, 2018లో 50వేల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే సెటిలర్స్పై దాడులు చేస్తారని అప్పటి ప్రభుత్వ పెద్దలు, సమైక్య పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. 18 నెలల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టడం కాదు కదా.. కనీసం గిల్లిన సందర్భాలు కూడా లేవన్నారు. సీమాంధ్రులు ఆలోచించి ఓటేయాలి.. బీఎన్రెడ్డి నగర్ కాలనీలో ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య, సచివాలయనగర్లోని భూమి సమస్యలు పరిష్కారం కావాలంటే అధికార పార్టీకే ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. వనస్థలిపురం రైతుబజార్ వద్ద ఆయన మాట్లాడుతూ సీమాంధ్రులు ఆలోచించి ఓటేయాలని కోరారు. సీమాంధ్రులంతా తెలంగాణ వాదులేనని పేర్కొన్నారు. విడిపోవడం వల్ల రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకూ 85వేల పట్టాలిచ్చామని, వనస్థలిపురం రైతుబజార్ వద్ద గుడిసెవాసులకు పక్కా ఇళ్లు కట్టిస్తామని, ఆటోనగర్ ఇసుక లారీల అడ్డాను తొలగిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచామని, కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’లా మారిందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి దోహదం చేస్తాయన్నారు. ప్రచారంలో మంత్రి జగదీష్రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఇంచార్జి రాంమోహన్గౌడ్, నాగోలు, కొత్తపేట, మన్సూరాబాద్, హయత్నగర్, వనస్థలిపురం, బీఎన్రెడ్డినగర్, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ డివిజన్ల అభ్యర్థులు చెరుకు సంగీత, జీ.వి.సాగర్రెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, సామ తిరుమల్రెడ్డి, జిట్టా రాజశేఖర్రెడ్డి, లక్ష్మీప్రసన్న, పద్మానాయక్, సామ రమణారెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్లు పాల్గొన్నారు. సెటిలర్స్పై దాడులు చేస్తామని సమైక్యవాదులు తప్పుడు ప్రచారం చేశారు. 18 నెలల కాలంలో కొట్టడం కాదు కదా.. కనీసం గిల్లిన సందర్భాలు కూడా లేవు నగరాభివృద్ధి తాత, నాన్న చలవే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది మా తాత, నాన్నలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ సర్కిల్లోని డివిజన్లలో ఆయన మంగళవారం ప్రచారం నిర్వహించారు. కుత్బుల్లాపూర్, షాపూర్నగర్, ఐడీపీఎల్ చౌరస్తాల్లో రోడ్షోల్లో పాల్గొన్నారు. సైకిల్ జోరందుకుందని.. టీఆర్ఎ్స్ కారు టైరు పంక్చర్ అయిందని ఎద్దేవా చేశారు. మేయర్ పీఠాన్ని తామే దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాయమాటలతో 70 ఎం.ఎం. సినిమా చూపిస్తున్నారని, సీఎం అయ్యాక 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్, టీడీపీ అభ్యర్థులు గడ్డం స్వాతికా రెడ్డి, బొడ్డు కామేశ్వరి, మన్నెరాజు, మెటె శ్రీనివాస్, కొట్టె రాధిక, సుజాతలు పాల్గొన్నారు. అధికారమిస్తే మరింత అభివృద్ధి... టీడీపీ, బీజేపీకి పట్టం కడితే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని లోకేష్ అన్నారు. మల్కాజిగిరి సర్కిల్లోని ఆరు డివిజన్లలో నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ‘గూగుల్లో హైదరాబాద్ను వెతికితే కనిపించే చార్మినార్, బుద్ధుడు, హైటెక్ సిటీల్లో.. రెండింటిని టీడీపీనే ఏర్పాటు చేసింద’ని లోకేష్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు మాట్లాడితే 400 ఏళ్ల చరిత్ర అంటున్నారని, కానీ 40 ఏళ్ల చరిత్ర తిరిగేస్తే టీడీపీ అభివృద్ధి తెలుస్తుందన్నారు. కేసీఆర్కు ముఖం చెల్లక కేటీఆర్ను ప్రచారానికి పంపించారని విమర్శించారు. తెలంగాణకు తక్కువ ఇల్లు కేటాయిస్తే చంద్రబాబునాయుడు ప్రధానితో మాట్లాడి 50 వేల ఇల్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 100 సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరి మాటమార్చారని విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలతో కేటీఆర్ రాజీనామా చేయించి.. ఆయన వారిని తిరిగి గెలిపించుకుంటే, తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. టీడీపీ, బీజేపీ కూటమితోనే నగరాభివృద్ధి జరిగిందని ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావులు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థులు మండలి విజయ్కుమార్ యాదవ్(మల్కాజిగిరి), శ్యామల (గౌతంనగర్), పిట్టల రేణుక(వినాయకనగర్), బీజేపీ అభ్యర్థులు బాబూసింగ్(ఈస్ట్ ఆనంద్బాగ్), సునీత(మౌలాలి), ప్రసన్న నాయుడు(నేరెడ్మెట్)లను లోకేష్ పరిచయం చేశారు. ప్రచారంలో సీతక్క, మండలి రాధాకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. హైదరాబాద్ను గూగుల్లో వెతికితే కనిపించే చార్మినార్, బుద్ధుడు, హైటెక్ సిటీల్లో రెండింటిని టీడీపీనే ఏర్పాటు చేసింది -
పరుగుతో ఆరోగ్యం
మారథాన్ రన్ బహుమతి ప్రదానోత్సవంలో సీఎం చంద్రబాబు {పారంభించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ స్పోర్ట్స్ : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను క్రీడలు, పరుగుల ద్వారా యువత సమకూర్చుకోవాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డీప్ (డిసీజ్ ఎరాడి కేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి మారథాన్ రన్ బహుమతి ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత రోజులో కనీసం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేరకు పరిగెట్టి ఆరోగ్యవంతులు కావాలన్నారు. రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు నగదు చెక్కులను అందజేశారు. తొలుత రన్ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. రన్లో పాల్గొనేవారంతా ఉదయం ఐదు గంటలకే స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 6.15 గంటలకు హాఫ్ మారథాన్ రన్ను నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏడు గంటలకు కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, సినీ హీరో శర్వానంద్ జెండా ఊపి 10కే, 5కే రన్లను ప్రారంభించారు. రన్లో పాల్గొనేవారికి టీ-షర్ట్, స్నాక్స్, టైమింగ్ చిప్తో కూడిన రిబ్ను అందజేశారు. హాఫ్ మారథాన్లో కొందరు ప్రొఫెషనల్ రన్నర్లతో పాటు హైదరాబాద్, ఇతర నగరాల నుంచి లాంగ్ డిస్టెన్స్ రన్నర్లు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, రాష్ట్ర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏడున్నర వేల మంది రన్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. హాఫ్ మారథాన్లో తక్కువ మంది పాల్గొనగా, 10కే, 5కే రన్లో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు కృష్ణా, గుంటూరు కలెక్టర్లు బాబు.ఎ, కాంతిలాల్ దండే, శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, యువజన, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, శాప్ ఎండీ జి.రేఖారాణి, సినీ హీరోలు రామ్, శర్వానంద్, నాగశౌర్య, చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, రన్ డెరైక్టర్లు డీప్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎన్.మురళి, డాక్టర్ మధు, డాక్టర్ రాకేష్, గజల్ శ్రీనివాస్, రన్ నిర్వాహక కమిటీ సభ్యుడు కె.పట్టాభిరామ్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.పురుషోత్తం పాల్గొన్నారు. విజేతలు వీరే హాఫ్ మారథాన్ రన్లో పురుషుల విభాగంలో లెంలెం మిక్కియాస్ (ఇథియోపియా), శ్యామల్ కమాయ్ మొహుతు (కెన్యా), బి.శ్రీను (విజయనగరం), మహిళా విభాగంలో నేహాసింగ్, జ్యోతి జె.చౌహాన్ , పద్మావతి వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వారు రూ.80 వేలు చొప్పున గెలుచుకున్నారు. హాఫ్ మారథాన్ వెటరన్ పురుషుల విభాగంలో పప్పు నారాయణ, సునీల్ గౌద్, చక్రధర్ నన్నపనేని, మహిళా విభాగంలో జాక్యులెన్ బబితా విజేతలుగా నిలిచారు. 10కే రన్లో మెల్ల మెర్జ్జీబో ఎలిము, ఇర్రిమాన్, ఖరమూర్సింగ్, మహిళా విభాగంలో వినయపియం, వి.ప్రియాంక, జె.సంగీత, 10కే రన్ వెటరన్ విభాగంలో ఎ.కుమార, ఎం.తియోపిలోస్, యు.ఏడుకొండలు, మహిళా విభాగంలో వి.లక్ష్మిశ్రీ, కె.జ్యోతి వరుస స్థానాల్లో నిలిచారు. మారథాన్లో కలెక్టర్ కాంతిలాల్దండే తాడేపల్లి రూరల్ : అమరావతి మారథాన్ రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద ఉదయం 5.30 గంటలకు 5కె, 10కె, హాఫ్ మారథాన్ రన్ మూడు బృందాలుగా ప్రారంభమైంది. 5కె రన్ విజయవాడలో ముగియగా, 10కె, హాఫ్ మారథాన్ గుంటూరు జిల్లాలోకి ప్రవేశించాయి. జిల్లా ముఖద్వారం సీతానగరం వద్ద 10కె రన్ ముగియగా, అమరావతి కరకట్ట మార్గంలో ఉన్న ప్రకృతి ఆశ్రమం వద్ద హాఫ్ మారథాన్ ముగిసింది. హాఫ్మారథాన్లో గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పాల్గొన్నారు. సీతానగరం ప్రకాశం బ్యారేజీ వద్ద అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్డీవో భాస్కరనాయుడు, డీఈవో శ్రీనివాసులురెడ్డి, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, కమిషనర్ శివారెడ్డి, తదితరులు కలెక్టర్కు స్వాగతం పలికారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు నేతృత్వంలో డీఎస్పీ గోగినేని రామాంజ నేయులు, సీఐలు హరికృష్ణ, బ్రహ్మయ్య, ఎస్ఐ వినోద్కుమార్ తదితరులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10.30 వరకు బ్యారేజీపై రాక పోకలు నిలిపివేయడంతో సీతానగరం, ఉండవల్లి సెంటర్, కెఎల్ కాలనీలకు చెందిన ప్రజలు, రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
జీఎస్టీపై సహకరించండి
కాంగ్రెస్కు ప్రభుత్వం వినతి * సోనియా, మన్మోహన్లతో భేటీ అయిన వెంకయ్య * హామీ ఇవ్వని సోనియా.. పార్టీలో చర్చించి చెప్తామని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి కాంగ్రెస్ గడప తొక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్లతో గురువారం భేటీ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లుల ఆమోదానికి సహకరించాలని.. కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినట్లయితే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సాధారణ షెడ్యూలు కంటే ముందస్తుగా జరపడానికి ప్రభుత్వ సన్నద్ధతను సోనియాకు వెంకయ్య వివరించారు. గత నవంబర్ 27న ప్రధానమంత్రి నివాసంలో మోదీతో సోనియా, మన్మోహన్ల భేటీ తర్వాత ప్రభుత్వం తరపున కాంగ్రెస్తో అధికారికంగా జరిగిన భేటీ ఇదే. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన చర్చల అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీతో పాటు ఇతర కీలక బిల్లులపై కాంగ్రెస్ తుది వైఖరిని స్పష్టం చేయాలని కోరినట్లు తెలిపారు. బిల్లుపై కాంగ్రెస్ లేవనెత్తిన వివిధ అంశాలపై జైట్లీ ఇప్పటికే సమాధానాలిచ్చారని కాగ్రెస్ నాయకత్వానికి తెలియజేసినట్లు వివరించారు. రియల్ ఎస్టేట్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదికను కేంద్రం ఆమోదించిందని,అందువల్ల ఈ రెండు బిల్లులకు ఆమోదం లభించేలా సహకరించాలని వెంకయ్య కోరారు. తమ పార్టీలో అంతర్గతంగా చర్చించి చెబుతామని సోనియా గాంధీ తమతో చెప్పారని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్, ఉపనేత ఆనందశర్మలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది. కాంగ్రెస్ సానుకూలత వ్యక్తం చేస్తే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి సోనియా లేదా రాహుల్గాంధీలను మరోసారి కలవటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. లిఖితపూర్వకంగా జవాబివ్వండి: కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలపై నీళ్లు చల్లుతూ కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ బిల్లుపై తమ విధానాన్ని పునరుద్ఘాటించింది. జీఎస్టీ బిల్లుకు తాము వ్యతిరేకం కాదంటూనే, ఈ బిల్లుపై తాము లేవదీసిన అంశాలపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక జవాబు కోసం ఎదురుచూస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కపిల్ సిబల్ స్పష్టం చేసారు.ఈ బిల్లుకు ఆమోదం పొందే విషయంలో ప్రభుత్వం సీరియస్గా లేదని కపిల్ సిబల్ ఆరోపించారు. ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే కాంగ్రెస్ లేవదీసిన అంశాలపై సంప్రదింపులు జరపాలని సిబల్ అన్నారు. జీఎస్టీ బిల్లును గత యూపీఏ ప్రభుత్వం రూపొందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో ఈ బిల్లును మోడీ వ్యతిరేకించారని సిబల్ చెప్పారు. అంతేకాకుండా రాజ్యసభలో కాంగ్రెస్ బలం క్షీణిస్తోందని, అందువల్ల జీఎస్టీ బిల్లుకు త్వరలో పార్లమెంట్ ఆమోదం లభిస్తుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జేట్లీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వాస్తవానికి స్వదేశీ జాగరణ్ మంచ్, ఆర్ఎస్స్లు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని, ఆర్ధిక మంత్రి కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారని సిబల్ చెప్పారు. -
‘ట్రస్టు చట్ట సవరణ’కు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నిరసనల మధ్యే లోక్సభ బుధవారం ‘భారతీయ ట్రస్టుల చట్టం (1882) సవరణ 2015’కు ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం వల్ల ట్రస్టులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వటంతోపాటు.. వీటి నిధులను సెక్యూరిటీస్లో పెట్టుబడిపెట్టేందుకు వీలుంటుంది. 2014 డిసెంబర్లో ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు అమలుకు విపక్ష కాంగ్రెస్ సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీఎస్టీ అమలు దేశానికి చాలా కీలకమన్నారు. ► త్వరలో రష్యాలో పర్యటించనున్న ప్రధాని అణుబంధ విస్తృతిపైనే ప్రధానంగా చర్చిస్తారని పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ► మొబైల్ వినియోగదారులకు ఎస్టీడీ చార్జీల తొలగింపుపై ఎలాంటి ప్రతిపాదన లేదని టెలికాం మంత్రి రవిశంకర్ లోక్సభకు తెలిపారు. ► సిబ్బంది శిక్షణ విభాగం(డీవోపీటీ) అనుమతి తీసుకున్నాకే గ్రూప్-బీ నాన్గెజిటెడ్, గ్రూప్-సీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించుకోవాలని వివిధ ప్రభుత్వ విభాగాలకు కేంద్రం స్పష్టం చేసింది. ► వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా మహారాణా ప్రతాప్ 475వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. ► ‘జాతీయ నేత’గా ఎవరిని ప్రకటించాలనే విషయంలో నిబంధనలేమీలేవని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నకు ప్రభుత్వం జవాబిచ్చింది. -
26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈ నెల 26 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని సోమవారం పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) నిర్ణయించింది. 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సమావేశాల తొలి రెండు రోజులను ప్రత్యేకంగా నిర్వహించాలని హోంమంత్రి అధ్యక్షతన సమావేశమైన సీసీపీఏ నిర్ణయించింది. ‘ఈ సంవత్సరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషిని నవంబర్ 26, 27 తేదీల్లో స్మరించుకుంటాం. ఆ రెండు రోజులు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ ఉండవు’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. -
సీఎం, పీఎంలు కలిసి పనిచేయాలి
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సాక్షి, హన్మకొండ: పార్టీలు వేరైనా దేశాభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కలిసి పని చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అగ్యుమెంటేషన్ యోజనా (హృదయ్) పథకాన్ని ఆదివారం వరంగల్ నగరంలో ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రూ 40 కోట్ల వ్యయంతో నగరంలో ఖిలావరంగల్, వేయిస్తంభాలగుడి, పద్మాక్షి ఆలయం, దర్గా కాజీపేట, భద్రకాళి చెరువులను అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో రూ. 14.9 కోట్ల వ్యయంతో భద్రకాళీ ఫోర్ షోర్బండ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేయి స్తంభాలగుడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధికోసం సీఎం, పీఎంలు కలిసి పని చేయాలన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఒక పడకగది ఇళ్లు నిర్మిస్తామని ప్రకటిస్తే, దానికి అదనంగా తాము మరోగదిని జత చేసి డబుల్బెడ్ ఇళ్లు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని, ఇందుకు ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నగరాలలో జరిగే అభివృద్ధి పథకాలన్నీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనే ఉంటాయని సూచనప్రాయంగా వెల్లడించారు. అందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో 34 పట్టణాలు ఎంపిక చేసినట్లు తెలిపారు. అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో 13 పట్టణాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. ప్రధాన్మంత్రి జన్ధన్యోజన కింద 18 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు ప్రారంభించినట్లు చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి హృదయ్ పథకం రెండోదశ ద్వారా అదనంగా రూ. 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
దేశంలో కమ్యూనిజానికి స్థానం లేదు
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ఆలోచనకు కమ్యూనిజం సరిపోదని.. ఆ సిద్ధాంతాలకు ఇక్కడ స్థానం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కమ్యూనిజానికి ఒకప్పుడు ఆకర్షణ ఉండేదని, ప్రస్తుతం నేషనలిజాన్నే యువత ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశం మానవతావాదం వల్లే అభివృద్ధి చెందుతుందని, జాతి పునరుజ్జీవనానికి దీన్దయాళ్ ఉపాధ్యాయ ఆనాడే బీజం వేశారని అన్నారు. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని సూచించిన మహనీయుడు దీన్దయాళ్ అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న బీజేపీ వైపు దేశమంతా ఆశగా ఎదురు చూస్తోందని చెప్పారు. కానీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు కలిసి ‘సెక్యులరిజం’ అంటూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.కమ్యూనిస్టుసిద్ధాం తాలు మంచివి కాకపోయినా... ఆపార్టీలో పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి మంచి వ్యక్తులు ఉండేవారన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు చాలా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేదన్నారు. ఒక చాయ్వాలా దేశ ప్రధానిగా ఎదిగి సూట్ వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందని.. మోదీ దేశాన్ని మరో పదేళ్లు పాలిస్తే సమూల మార్పులు తెచ్చి అన్ని వర్గాలకు న్యాయం చేస్తారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్రెడ్డి పాల్గొన్నారు. -
‘అందరికీ ఇళ్ల’లో భాగం కండి
ప్రైవేటు రంగానికి కేంద్రమంత్రి వెంకయ్య విజ్ఞప్తి న్యూఢిల్లీ: ‘అందరికీ ఇళ్లు’ పథకంలో ప్రైవేటు భాగస్వాముల పాత్ర చాలా కీలకమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో భారీ పెట్టుబడులకు ముందుకు రావాలని, అందుబాటు ధరల్లో పేదలకు ఇళ్లు నిర్మించడంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. మురికివాడల పేదలను ఎక్కడికి తరలించబోమని స్పష్టంచేశారు. వారు కోరుకుంటే.. ఉన్నచోట లేదా మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి నిర్దేశిత కాలంలో... లే అవుట్లకు, బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు సింగిల్విండో వ్యవస్థ ప్రవేశపెడతామని వెల్లడించారు. బుధవారమిక్కడ ఇళ్ల నిర్మాణంపై అసోచామ్ ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ‘ప్రస్తుతం దేశంలో 1.8 కోట్ల ఇళ్ల కొరత ఉంది. దీన్ని అధిగమించేందుకు వచ్చే ఎనిమిదేళ్లపాటు ఏడాదికి 20 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉంది’ అని చెప్పారు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షంపై వెంకయ్య మండిపడ్డారు. ‘ఇళ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు నిర్మించాలంటే భూమి కావాలి. వాటిని గాల్లో కట్టలేం. భూమి లేకుంటే ఇళ్లు ఎలా కడతారు? భూసేకరణ అసాధ్యంగా మారిందని పలు రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయి. 2013 నాటి భూసేకరణ బిల్లును సవరించాలని కోరాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ బిల్లును కొందరు అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. -
వారంలో విజయవాడ మెట్రోకు టెండర్లు
-
వారంలో విజయవాడ మెట్రోకు టెండర్లు
మీడియాకు వెల్లడించిన ఏపీ సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సివిల్ టెండర్లను వారంలో పిలుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిం చారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు పనులు ప్రారంభించాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కి సూచించి నట్లు తెలిపారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు బాధ్యతల్ని కూడా డీఎంఆర్సీకే అప్పగిస్తున్నట్లు చెప్పారు. రెండు ప్రాజెక్టుల్ని 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని కోరామన్నారు. శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలోని రెండు మెట్రో రైలు ప్రాజెక్టులపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు సవివర నివేదికను శ్రీధరన్ ఇచ్చారని, త్వరలో దానిపై కేబినెట్లో చర్చించి ఆమోదిస్తామన్నారు. 42.55 కిలోమీటర్ల మేర తొలి దశలో విశాఖ ప్రాజెక్టు నిర్మాణమవుతుందని తెలిపారు. దీనికి రూ. 12,725 కోట్లు ఖర్చవుతుందని డీఎంఆర్సీ తన నివేదికలో పేర్కొందన్నారు. ఈ ప్రాజెక్టుకు 30.22 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందన్నారు. జనాభా నిబంధన సడలిస్తాం: వెంకయ్య కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, మెట్రో రైళ్లకు అనుమతివ్వాలంటే 20 లక్షల జనాభా ఉండాలనే నిబంధనను విజయవాడ, విశాఖ విషయంలో సడలిస్తామని చెప్పారు. దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ర్యాంకింగ్ లేకపోవడం వల్లనే స్మార్ట్ సిటీగా విజయవాడను ఎంపిక చేయలేక పోయామన్నారు. సమావేశంలో మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్, డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్, మంత్రి నారాయణ, విశాఖ ఎంపీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఆదుకోండి : ఏపీ సీఎంకు వినతి సమస్యలు పరిష్కరించాలని పలువురు శనివా రం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు సమర్పించారు. పేదలు, సామాన్యులను కలిసేందు కు సీఎం అవకాశం ఇవ్వడంలేదని విమర్శలొచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి రోజూ 12 నుంచి 1 గంట వరకూ సందర్శకులను ఆయన కలుస్తున్నారు. తమ గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు లేవని పలువురు మహిళలు సీఎంకు ఫిర్యాదు చేశారు. కాగా కళాశాలలు, యూనివర్సిటీల్లో లోపాలు గుర్తించేం దుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
అభివృద్ధిని ఓర్వలేకనే అడ్డుకుంటున్నారు
కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తిన వెంకయ్యనాయుడు జీఎస్టీ ఆమోదం విషయమై అన్ని పార్టీలతో మాట్లాడుతాం బెంగళూరు : ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. అందువల్ల దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే కీలక బిల్లులు చట్టసభల్లో ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బెంగళూరులో శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ముద్రా బ్యాంక్, తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రస్తుతం దేశ జీ.డీ.పీ గతంలో ఎప్పుడూ లేన ంతగా 7.5గా ఉందన్నారు. ఇదే విధంగా భారత దేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తే రానున్న రెండేళ్లలోనే ఆర్థికాభివృద్ధిలో చైనాను మించిపోతుందని ప్రపంచబ్యాంకు వంటి సంస్థలే చెబుతున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలా ఎన్డీఏ పాలనకు దేశంలోని వివిధ వర్గాల ప్రజల నుంచే కాక ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రశంసలను ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు జీఎస్టీ బిల్లులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జీ.ఎస్.టీ బిల్లు అమల్లోకి వస్తే భారత జీ.డీ.పీ మరో 2 శాతం వరకు పెరుగుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలను అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే అత్యంత విలువైన వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారన్నారు. తమతో పాటు మిగిలిన అన్ని పార్టీలు వర్షాకాల సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించాలని చెప్పినా కాంగ్రెస్ మాత్రం మొండిపట్టు వీడక పోవడంతో సభాసమయం వృథా అయిపోయిందన్నారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్లోపు జీ.ఎస్.టీ బిల్లును ఎలాగైనా సరే అమల్లోకి తీసుకురావాల్సి ఉందన్నారు. అందువల్ల తాము అన్ని పార్టీనాయకులతో మాట్లాడి ఈ బిల్లు ఆమోదం పొందడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు మిగిలిన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటు వెల్లోకి దూసుకుపోయి కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదన్నారు. ఇప్పటి వరకూ ఓ ప్రధాన పార్టీ అధ్యక్షులు ఎవరూ ఇలా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచిన దాఖలాలు లేవన్నారు. ఇలాంటి పరిస్థితులు మరోసారి ఉత్పన్నం కాకుండా పార్లమెంటు నియమావళిలో కొన్ని మార్పులు చేయడంతో పాటు వాటిని ఉల్లంఘించిన వారి పై చర్యలు తీసుకోవడంపై విస్తృత చర్చ జరిపి ఆమేరకు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడంపై మీరేమంటారు అన్న ‘సాక్షి’ ప్రశ్నకు వెంకయ్యనాయుడు బదులు చెప్పకుండా విలేకరుల సమావేశం నుంచి వడివడిగా వెళ్లిపోయారు. -
‘స్మార్ట్’ జాబితాలో పలు చిన్న నగరాలు!
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద ‘స్మార్ట్’ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన జాబితాలో రాష్ట్రాల రాజధానులను తోసిరాజని పలు చిన్న నగరాలు చోటు పొందడం విశేషం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈ జాబితాలో.. ఎన్నికల ముంగిట్లో ఉన్న బిహార్ రాజధాని పాట్నాకు చోటు దక్కకపోగా.. బిహార్ షరీఫ్ పేరు నామినేట్ అయింది. హిమాచల్ప్రదేశ్లో సిమ్లాను తోసిరాజని ధర్మశాల చోటుపొందింది. కర్ణాటకలో శివమొగ్గకూ చోటు దక్కింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 13 నగరాలకు చోటు లభించింది. జాబితాలో చేరిన వాటిలో ఇంకా రాయ్పూర్, గువాహటితోపాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఉంది. ఢిల్లీతోపాటు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకూ చోటు లభించింది. ముంబై, కోల్కతా, లక్నో, జైపూర్, రాంచీ, భువనేశ్వర్లూ ఇందులో ఉన్నాయి. ఇప్పటివరకు తమకు 98 నగరాలకు సంబంధించిన ప్రతిపాదనలు అందాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. వీటిపై విశ్లేషించి తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేసి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కోదానికి రూ.200 కోట్ల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఈ నెలాఖరుకల్లా 20 నగరాల ఎంపిక జరుగుతుందన్నారు. అనంతరం రాబోయే రెండేళ్లలో 40 నగరాలు చొప్పున ఎంపిక చేసి నిధులను అందజేస్తామని తెలిపారు. -
మోదీ పాలనను ప్రపంచం గమనిస్తోంది
నాట్స్ ముగింపు సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు లాస్ఏంజెలిస్ నుంచి సాక్షి ప్రతినిధి: ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతున్నాయని, త్వరలో అగ్రరాజ్యాల సరసన భారత్ నిలుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. శనివారం రాత్రి లాస్ఏంజెలిస్లో జరిగిన నాట్స్ ముగింపు సభలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ప్రధాని మోదీ పరిపాలన గురించి చెప్పుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని ‘‘ ఏబుల్ లీడర్- స్టేబుల్ గవర్నమెంట్’’ ఏర్పడిందని తెలిపారు. మోదీ 3డీ లాంటివాడని డైనమిక్, డెసిషన్, డెవలప్మెంట్ అనే భావంతో పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు. నాట్స్ చేస్తున్న సేవలను వెంకయ్య ప్రశంసించారు. నాట్స్ చేపట్టిన ‘‘ భాషే రమ్యం-సేవే గమ్యం’’ అనే నినాదం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని వెంకయ్య పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్తో పాటు తాను విశాఖలో కలసి చదవుకున్నానని, ఆయన చేతులమీదుగా నాట్స్ అవార్డును తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జీఎంఆర్తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, అమెరికా పారిశ్రామిక వేత్త డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, డాక్టర్ ఆలపాటి రవి, ఆచంట రవి, దేశు గంగాధర్, పాపుదేశి ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో అతిథులను అవార్డులతో సత్కరించారు. నాట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదాల రవిని వెంకయ్యనాయుడు సత్కరించారు. అనూప్రూబెన్స్ సంగీత విభావరి ఆకట్టుకుంది. 3 రోజుల నాట్స్ సభలను విజయవంతం చేసిన అందరికీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదాల రవి, ప్రస్తుత అధ్యక్షుడు ఆచంట రవి, సమావేశాల సమన్వయకర్త ఆలపాటి రవి కృతజ్ఞతలు తెలిపారు. -
దేశానికి పంగనామాలు పెట్టొద్దు
తానా రెండో రోజు మహా సభల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదన్న జస్టిస్ ఎన్వీ రమణ డెట్రాయిట్: అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) మహాసభలు రెండోరోజు ఘనంగా జరిగాయి. ఈ సభలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మతం ఏదైనా, కులం ఏదైనా జనాలందరూ తమకు కావల్సినట్లు అడ్డనామమో, నిలువునామమో పెట్టుకోండిగానీ దేశానికి మాత్రం పంగనామాలు పెట్టొద్దని అన్నారు. భారతీయ విధానాల్లో సైన్స్ నిగూఢంగా దాగుందన్నారు. ధ్యానం దేవుడితో మాట్లాడే వైర్లెస్ టెక్నాలజీ అని చెప్పారు. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ మాట్లాడుతూ 36.5 కోట్ల మంది యువతతో భారత్ నవయవ్వనంతో తొణికిసలాడుతోందని అన్నారు. తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదని, జపాన్, చైనా దేశాలు భాషనే ఆయుధంగా మలుచుకుని ప్రపంచ వాణి జ్యాన్ని శాసిస్తున్నాయని అందుకే అందరూ భాషను గుర్తించి గౌరవించాలని కోరారు. అనంతరం వెంకయ్య నాయుడు వేడుకల సావనీర్ను విడుదల చేశారు. చిత్తూరు ప్రవాసులు న్యూట్రిన్ సంస్థల ఉపాధ్యక్షురాలు అనితారెడ్డికి ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో రాజకీయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు రైతులకు పింఛను పథకాన్ని అమలు చేయాలని సభల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందరూ తనను మౌనముని అంటారని కానీ తనను తాను మహామౌనమునిగా పిలుచుకుంటానని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సభలో చమత్కరించారు. రెండోరోజు జరిగిన పలు కార్యక్రమాల్లో నిర్మాత సురేశ్బాబు, ఏపీ స్పీకర్ కోడెల, మేరీల్యాండ్ ప్రతినిధుల సభ సభ్యురాలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ , ఎంపీ సీఎం రమేశ్, ఏపీ మంత్రులు అయ్యనపాత్రుడు, కామినేని, పరిటాల, క్యూబాలో భారత రాయబారి రవి, పితాని, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ , టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సినీనటుడు వెంకటేశ్, నటులు నారా రోహిత్, హరినాథ్ పొలిచెర్ల తదితరులు పాల్గొన్నారు. -
సారు... కానరారు..
మామూలుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దేశ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా వారానికో, రెండు వారాలకోసారైనా హైదరాబాద్ కొచ్చి ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టడం అనవాయితీ. గతంలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనూ వారంతంలో హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా విలేకరుల సమావేశాలు నిర ్వహించేవారు. ఈ విషయంలో ఎందుకో ఈ మధ్య నెల రోజులుగా పూర్తి నల్లపూస అయిపోయారు. వారం వారమో.. కనీసం రెండు వారాలకైనా హైదరాబాద్కు వస్తున్నారు కానీ, విలేకరుల సమావేశాలు నిర్వహించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనిపై ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ, రాజకీయ నేతలలోనూ ఆసక్తి చర్చ జరుగుతోంది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై ఇటీవల ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆడియో టేపుల ఆరోపణలు రావడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం పోలీసు వాహానాల కొనుగోలు అంశంలో వివాదం వంటి కారణంగానే ఆయన ఈ మధ్య కాస్త మీడియా దూరంగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మే 29న ఆయన అధికారికంగా హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ తరువాత మే 31నే ‘ఓటుకు కోట్లు’ కేసు వెలుగులోకి రావడంతోనే మిత్రపక్షానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేకే మీడియాకు దూరంగా ఉంటున్నారని ఆయన వెనుక సెటైర్లు ఊపందుకున్నాయి. -
నగరం ఇక స్మార్ట్!
- ‘అమృత్’లో బెజవాడకు స్థానం - నగరవాసుల్లో ‘స్మార్ట్’ ఆశలు - మంత్రి వెంకయ్యతో మేయర్ భేటీ - జిల్లాలో మచిలీపట్నం, గుడివాడకూ చోటు విజయవాడ సెంట్రల్ : షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఐనాక్స్ థియేటర్లతో భాసిల్లుతున్న బెజవాడ నగరం భవిష్యత్తో మరింత ఆకర్షణీయ (స్మార్ట్) హంగులను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి పథకం అటల్ అర్బన్ మోడ్రనైజేషన్ రెన్యువల్ స్కీం (అమృత్)లో నగరానికి చోటు దక్కడంతో అభివృద్ధి పరుగు పెడుతుందన్న ఆశలు రేకెత్తుతున్నాయి. దేశంలో 100 స్మార్ట్ సిటీలు, 500 అమృత నగరాలను తీర్చిదిద్దాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో గురువారం పట్టణ స్మార్ట్ సిటీ మిషన్, అటల్ అర్బన్ మోడ్రనైజేషన్ రెన్యువల్ స్కీం సంయుక్తంగా నిర్వహించిన వర్క్షాప్లో నగర మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ పాల్గొన్నారు. శుక్రవారంతో ఈ వర్క్షాప్ పూర్తి కానుంది. సమష్టి కృషితో అభివృద్ధి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగరపాలక సంస్థ సమష్టిగా కృషి చేస్తేనే విజయవాడ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని ఈ వర్క్షాప్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్, గుడివాడ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే విజయవాడను అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాల్సిందిగా కోరారు. నగరంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను అందించారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు చేయూత నివ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వెంకయ్య మాట్లాడుతూ సమష్టి కృషితో అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటీ అంటే... అన్నీ అనుకున్నట్లే జరిగి నిధుల వరద వస్తే నగర రూపురేఖలు మారిపోతాయనడంతో సందేహం లేదు. మెట్రో రైలు, సువిశాలమైన రోడ్లు, గ్రీన్ ఫీల్డ్, అత్యాధునిక టెక్నాలజీతో శానిటేషన్ అభివృద్ధి, 24 గంటలు విద్యుత్ సౌకర్యం, రోజంతా నగర ప్రజలకు అందుబాటులో శుద్ధమైన మంచినీరు, ఆధునిక హంగులతో కూడిన రైల్వేస్టేషన్, బస్టాండ్, విమానాశ్రయం, సిటీ మొత్తం వైఫై సౌకర్యం, గ్రీన్ ఫీల్డ్, డిస్నీల్యాండ్, కాలువల్లో బోటింగ్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయి. జేఎన్ఎన్యూఆర్ఎం,‘రే’ కనుమరుగు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం), రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకాలు ఇకపై కనుమరుగు కానున్నాయి. 2007లో విజయవాడ నగరం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద ఎంపికైంది. రూ.1,422 కోట్లతో నగరాభివృద్ధి, గృహ నిర్మాణాలను ప్రారంభించారు. అర్బన్ ఇన్ఫాస్ట్రక్చర్ గవర్నెన్స్ (యూఐజీ) కింద రోడ్లు, డ్రెయిన్లు, భూగర్భ డ్రెయినేజ్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, వాటర్ ప్లాంట్ల పనులు రూ.724 కోట్లతో చేపట్టారు. ఇందులో 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఆనాడు చేసిన సర్వేలో లక్షా 4 వేల మందికి గృహాలు కావాలని తేలింది. తొలి విడతగా 28,152 గృహ నిర్మాణాలను చేపట్టాలని కార్పొరేషన్ నిర్ణయించింది. స్థలాల కొరత నేపథ్యంలో 18,176 గృహ నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 14,345 పూర్తి చేశారు. 3,841 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకం కింద ఎన్ఎస్సీ బోస్ నగర్లో 1,413, దాల్మిల్ ప్రాంతంలో 304 గృహ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి దాల్మిల్ ఏరియాలో శంకుస్థాపన కూడా చేశారు. నిధుల లేమి కారణంగా ఇంత వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చిన నేపథ్యంలో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులు, గృహ నిర్మాణాల పేరు అమృత్గా మారనుంది. మచిలీపట్నం, గుడివాడకు మహర్దశ జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ పురపాలక సంఘాలకు మహర్దశ పట్టనుంది. నగరంతో పాటు జిల్లా నుంచి ఈ రెండు పట్టణాలు కూడా అమృత్ పథకంలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఇవి కూడా స్మార్ట్ పట్టణాలుగా అభివృద్ధి చెందనున్నాయి. బందరు మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, కమిషనర్ మారుతీదివాకర్, గుడివాడ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ జి.ప్రదీప్కుమార్ కూడా ఢిల్లీలో జరిగిన వర్క్షాప్కు హాజరయ్యారు. -
వెంకయ్య ప్రసంగాన్ని అడ్డుకున్న విద్యార్థులు
యూనివర్సిటీక్యాంపస్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు కేంద్రమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సోమవారం ఎస్వీయూలో 54వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు అడ్డుకున్నారు. స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు ప్రసంగం ప్రారంభం కాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలంటూ రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్యనాయుడు పదవి రాగానే ప్రత్యేక హోదా విషయాన్ని మరచిపోయారని వారు విమర్శించారు. మంత్రి తన మాట నిలుపుకుని ప్రత్యేక హోదా వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. రాష్ట్రం విడిపోయాక అభివృద్ధిలో వెనుకపడిందని, ప్రత్యేక హోదా ద్వారానే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయడు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టుచేసి, అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హేమంతకుమార్, జిల్లా కార్యదర్శి సురేష్నాయక్, క్యాంపస్ అధ్యక్షుడు మురళీధర్, కిషోర్రెడ్డి, రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పడికట్టు పదాల్ని పక్కనపెట్టండి
కమ్యూనిస్టులకు కేంద్ర మంత్రి వెంకయ్య హితవు హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెట్టుబడిదారుల వద్ద మోకరిల్లుతున్నారంటూ కమ్యూనిస్టులు విమర్శించడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. మోదీకి ప్రపంచమే జయజయ ధ్వానాలు పలుకుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, అశోక్ కుమార్ తదితరులతో కలసి శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడిదారీ, బూర్జువా వంటి పడికట్టు పదాలను మాట్లాడటం మానేయాలని సూచించారు. మళ్లీ మమేకమయ్యేందుకు కమ్యూనిస్టులంతా యత్నించడాన్ని అభినందించారు. జనతా పరివార్తో ఆరు రాజకీయ పార్టీలు కలయిక సంతోషకరమేనన్నారు. కనీసం ఆరేళ్లయినా కలసి ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు రాగా తర్వాత మాట్లాడదామంటూ వెంకయ్య బదులిచ్చారు. అకాల వర్షాలవల్ల నష్టపోయిన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు పర్యటించారని, దీనిపై ఈ నెల 19న ప్రధానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశాల్లోనే భూ సేకరణ బిల్లు : బడ్జెట్ రెండో విడత సమావేశంలోనే ప్రస్తుతం ఆర్డినెన్స్ రూపంలో ఉన్న భూసేకరణ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని వెంకయ్య చెప్పారు. దీంతోపాటు నల్లధనం వెలికితీతకు ఉపయోగపడే ‘విదేశీ ఆస్తుల పన్ను’ విధింపు చట్టం, పన్నుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే జీఎస్టీ బిల్లు, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేజేషన్ బిల్లులు కూడా రాబోతున్నాయన్నారు. -
ఎన్కౌంటర్లపై కేంద్రం జోక్యం చేసుకోదు
అది రాష్ట్రాల అంశం: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, అవి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్కౌంటర్ల అంశం రాష్ట్రాల పరిధిలోనిది. వాటిపై కేంద్రం జోక్యం చేసుకోదు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్కౌంటర్పై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆ రాష్ర్ట ప్రభుత్వంపైనే ఉంది. ఎన్కౌంటర్ వల్ల తమిళనాడు, ఏపీల మధ్య ఏర్పడిన వివాదం ఏక్కడికి వెళుతుందో చూద్దాం. సిమి ఉగ్రవాదులను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్ధంగా పనిచేసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎన్కౌంటర్ జరిగితే కొంత మంది తీవ్రంగా స్పందిస్తున్నారు. సామాన్య ప్రజలు, పోలీసులు అలాంటి సంఘటనల్లో మరణిస్తే వీరు కనీసం మాట కూడా మాట్లాడరు. గతంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపితే మజ్లిస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదు. పోలీసులు మనుషులు కాదా?. ఎన్కౌంటర్లపై విచారణ జరపాలని కోరడంలో తప్పులేదు. కానీ అసహాయులు చనిపోయినప్పుడు మౌనం వహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల అతిగా స్పందించడం సరికాదు. ‘బోస్’ నిఘా వార్తలపై కాంగ్రెస్కు ఉలుకెందుకు? జాతి నేత సుభాష్ చంద్రబోస్ కుటుంబంపై గతంలో 20 ఏళ్లపాటు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న కథనాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను దేశ ప్రజల ముందుంచాలి. ఈ విషయాలు బయటకు పొక్కగానే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతోంది?. ఇళ్లు కొనేవారు, అమ్మేవారిద్దరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రియల్ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులైజేషన్ చట్టం ఆమోదం కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టబోతోంది. -
నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల సభలు
విజయవాడ బ్యూరో: మూడో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం విజయవాడలో ప్రారం భం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు దేశ, విదేశాల నుంచి 1,300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సభలు జరుగుతున్న పటమట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రాంగణానికి విశ్వనాథ సత్యనారాయణ సభా ప్రాంగణంగా నామకరణం చేశారు. శని వారం, ఆదివారం జరిగే ఈ సభల్లో తెలుగు భాష, వికాసానికి సంబంధించి 11 సదస్సులు నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, భావోద్వేగాలను అధిగమించి తెలుగును కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ప్రధాన చర్చ జరగనుంది. ఈ అంశాల్లో రచయితల బాధ్యత, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు తీర్మానాలు చేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభ సభలో పాల్గొం టారు. ఆదివారం ముగింపు సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పాల్గొంటారు. విదేశీ ప్రతినిధులు, ప్రముఖ సినీ రచయితలు నటులు మహాసభలకు హాజరవుతున్నారు. ప్రతినిధులకు రెండురోజూలూ సంప్రదాయ తెలుగు వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. 30 మందికి తెలుగు పద్యపేటికలు మహాసభలకు హాజరవుతున్న 30 మంది విశిష్ట అతిథులకు తాళపత్రాలతో తయారుచేసిన తెలుగు పద్య పేటికలను బహూకరించనున్నారు. నన్నయ నుంచి సి. నారాయణరెడ్డి వరకూ తెలుగు కవులు రచించిన ముఖ్య పద్యాలన్నింటినీ తాళపత్రాల్లో ముద్రించారు. బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ తంగిరాల వెంకట సుబ్బయ్య వీటిని తయారు చేశారు. కాగా, మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు వాటిని పరిశీలించారు. -
'అంతర్జాతీయ పర్యాటక మెడికల్ హబ్గా ఏపీ'
మంగళగిరి (గుంటూరు) : అంతర్జాతీయ పర్యాటక మెడికల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరముందని కేంద్రపట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో శనివారం పదో వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన వైద్యం అందిచేందుకు నేటి యువత పరిశోధనారంగంపై దృష్టి సారించాలి. నేటి యువత అబ్రాడ్ వెళ్లి సంపాదించి తిరిగి మాతృస్థలానికి వచ్చి సేవలు చేయాలి. కన్నతల్లి, జన్మభూమిని మరవరాదు. భారతదేశం విజ్ఞాన గని. నేటి యువతకు ఎన్నో ఆధునిక అవకాశాలు అందుబాటులో ఉన్నందున వాటిని అందిపుచ్చుకుని దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి' అని వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రం విడిపోవడంతో వైద్యరంగంలో మనం తీవ్రంగా నష్టపోయామని, దానిని పూడ్చుకునేందుకు ఆరోగ్య రాజధానిని నిర్మిస్తున్నామని రాష్ట్ర వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. -
నదుల అనుసంధానంపై ముందుకే సాగుతాం
కేంద్ర మంత్రి వెంకయ్య న్యూఢిల్లీ: నదుల అనుసంధానం విషయంలో ప్రాధాన్య క్రమంలో ముందుకు సాగుతామని, ఈ ప్రయత్నంలో ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ పరిష్కరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. నదుల అనుసంధానంపై కొందరి నిరసనలకు సమాధానాలు కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘ఇండియా వాటర్ వీక్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడినా తొలగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని వ్యక్తమవుతున్న ఆందోళనలను ఉద్దేశించి స్పందిస్తూ.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. అలాగే అన్ని స్థానిక సంస్థలకు జల సంరక్షణ చర్యలను తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వెంకయ్య పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. జల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల అమలులో వాతావరణ మార్పులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఇక గంగా నది శుద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఈ కార్యక్రమంలో వివరించారు. -
ఢిల్లీలోనే మొదటి స్మార్ట్సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దేశంలోనే మొదటి స్మార్ట్సిటీని ఏర్పాటుచేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. లండన్, శాన్ఫ్రాన్సిస్కో వంటి గ్లోబల్ సిటీల్లో ఉన్న అన్ని అత్యాధునిక సదుపాయాలతో ఢిల్లీని నిజమైన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని తాము ఆశిస్తున్నట్లు వెంయ్యనాయుడు చెప్పారు. డిస్నీ లాండ్, యూనివర్సల్ స్టూడియోస్ వంటి ప్రపంచస్థాయి వినోదప్రదేశాలు ఢిల్లీలోనూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఏర్పాటుచేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందని అందులో మొట్టమొదటి స్మార్ట్ సిటీ ఢిల్లీలోనే ఏర్పాటుచేస్తామని నాయుడు తెలిపారు. ఢిల్లీ దేశానికి గుండెకాయవంటిదని, అందుకే మొట్టమొదటి స్మార్ట్ సిటీ కూడా ఇక్కడే ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. ఈ దిశలో భారత్కు సాంకేతిక సహాయమందిస్తానని స్పెయిన్లోని బార్సిలోనా నగర అధికారులు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తాను ఇటీవల బార్సిలోనా నగరాన్నిసందర్శించానని, ఆధునిక భవనాలను కలిగి ఉన్న ఆ నగరం పురాతన భవనాలను కూడా పరిరక్షించుకుంటోందన్నారు. ఘనమైన సంప్రదాయ నిర్మాణాలు కలిగిన మనదేశంలో కూడా అటువంటి వాతావరణాన్ని కొనసాగించేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. స్మార్ట్ సిటీ ఏర్పాటు కోసం ‘లాండ్ పూలింగ్’ విధానం ద్వారా భూసేకరణ జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రస్తుతం పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, డీడీఏ పరిశీలిస్తున్నాయని వివరించారు. ఢిల్లీలో జనాభాతో వాహనాల సంఖ్య కూడా ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. నగరంలో ప్రస్తుతం 85 లక్షల వాహనాలు ఉన్నాయని, రద్దీని త్గగించడం కోసం సర్క్యులర్ రైల్వే, మాస్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలను తేవడంతో పాటు బీఆర్టీ కారిడార్ను పునరుద్ధరించడం, మెట్రో నెట్వ ర్క్ను విస్తరించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో స్మార్ట్ సిటీ ఏర్పాటుచేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు డీడీఏ వైస్చైర్మన్ బల్విందర్ కుమార్ తెలిపారు. స్మార్ట్ సిటీని పూర్తి ఉపనగరంగా నిర్మించనున్నట్లు ఆయన వివరించారు. ద్వారకా, రోహిణీ, నరేలాలకు చెందిన 20 -24 ఎకరాల్లో స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తారని ఆయన చెప్పారు. పూర్తి వైఫై కనెక్టివిటీ కలిగిన ఈ స్మార్ట్ సిటీ హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని, వర్షపునీటి సేకరణ, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం వంటి సదుపాయాలతో పాటు ఇతర అత్యాధునిక సదుపాయాలను కలిగి ఉంటుందని ఆయన చెప్పారు. ప్లాట్ల అలాట్మెంట్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి డీడీఏ హౌజింగ్ స్కీమ్- 2014 కింద ఫ్లాట్లు అలాట్ అయినవారికి వాటిని లాంఛనంగా అందించే ప్రక్రియను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. డీడీఏ ప్రధాన కార్యాలయం వికాస్ సదన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన లక్కీ డ్రాలో ఫ్లాట్లు గెలుచుకున్న కొంతమంది దరఖాస్తుదారులకు అలాట్మెంట్ లెటర్లను అందచేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరళీకరించనుందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు. పారిశ్రామిక ప్రదేశంలో ఫ్యాక్టరీలతో పాటు షోరూములు కూడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పరిశీలించడం కోసం త్వరలో ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. -
సరితావిహార్ అండర్పాస్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు సరితావిహార్ అండర్పాస్ వాహనచోదకులకు అందుబాటులోకి వచ్చింది. నోయిడా, ఓఖ్లా మధ్య సరితావిహార్ వద్ద నిర్మించిన 1,090 మీటర్ల పొడవు అండర్పాస్ను కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఢిల్లీ రోడ్లపైరద్దీని తగ్గించడం కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు.2010లో అండర్పాస్ నిర్మాణం పూర్తి కావలసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని జాప్యం చేసిందని, ఫలితంగా నిర్మాణ వ్యయం పెరిగిందని ఆయన చెప్పారు. ప్రజల సొమ్ము వృధా కావడం చూసిన తమ ప్రభుత్వం కొద్ది నెలల్లో అనేక సమావేశాలు జరిపి పనులు జరిగేలా చూసిందని మంత్రి చెప్పారు. రానున్న ఎన్నికలకు, అండర్పాస్ ప్రారంభోత్సవానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తగ్గిన దూరాభారం ఈ అండర్పాస్ వల్ల నోయిడా, ఓఖ్లాల మధ్య ప్రయాణ దూరం కనీసం 8 కిమీలు తగ్గింది. మెట్రో నిర్మాణం కారణంగా ఆశ్రం చౌక్ వద్ద ఎదుర్యే ట్రాఫిక్ జామ్ సమస్యకు కూడా పరిష్కారం లభించింది. బదర్పుర్ నుంచి నోయిడాకు వెళ్లే వాహనాలు ఇక ఆశ్రమ్చౌక్కు రానవసరం లేదు. సరితావిహార్ నుంచి ఓఖ్లా వెళ్లడానికి ఇప్పటి వరకు 9 కిమీల దూరం ప్రయాణించవలసి వచ్చేది. ఈఅండర్పాస్ వల్ల ఈ దూరం ఒక కిమీలకు ప్రయాణసమయం 45 నిమిషాల నుంచి 5 నిమిషాలకు తగ్గింది. ఈ అండర్పాస్లో వచ్చి, వెళ్లేందుకు మూడేసి లేన్ల చొప్పున మొత్తం ఆరు లేన్లు ఉన్నాయి. 5.5 మీ ఎత్తున్న అండర్పాస్లో నీరు చేరకుండా ఉండడం కోసం మూడు పంపులను ఏర్పాటు చేసినట్లు డీడీఏ ఇంజనీరు చెప్పారు. జాప్యం మిలా.. 2008లో డీడీఏ, రైల్వే కలిసి సరితావిహార్ అండర్పాస్ నిర్మించాలని నిర్ణయించాయి. రూ.121 కోట్ల ఖర్చుతో అండర్పాస్ నిర్మాణం జరపాలని నిర్ణయించారు. కానీ పనులు మొదలు పెట్టడమే మూడేళ్ల ఆలస్యంగా జరిగింది. ముందనుకున్నట్లుగా 21 నెలల్లో 2013 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 242 కోట్ల రూపాయలైంది. ప్రారంభోత్సవం బీజేపీ ఘనత కాదు అండర్పాస్ ప్రారంభోత్సవాన్ని బీజేపీ తన ఘనతగా చెప్పుకోవడాన్ని ఓఖ్లా మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ విమర్షించారు. ఓఖ్లాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. అండర్పాస్ నిర్మాణానికి కృషి చేసిన తనను పక్కన బెట్టి తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్ గిరీ, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూడీ ప్రారంభోత్సవ శిలా ఫలకం మీద తమ పేరు కూడా చెక్కించుకున్నారని ఆయన ఆరోపించారు. -
మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య ఆధిపత్య పోరు
అమలాపురం :మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య అమలాపురం నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఫ్లెక్సీల ఏర్పాటుతో మొదలైన వివాదం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (ఆల్డా) చైర్మన్ యాళ్ల దొరబాబుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు పార్టీ కార్యకర్తల వరకూ విస్తరించింది. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంగా అధికారపార్టీ నాయకులు అల్లవరం ఎస్సైపై బదిలీ వేటు వేయించగా, దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలతో మిత్రభేదం మరింత తీవ్రతరమైంది.అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన దొరబాబు ఇటీవల బీజేపీలో చేరారు. ఇందుకు మద్దతు తెలుపుతూ దొరబాబు అనుచరులు కొమరగిరిపట్నం సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటిని తొలగించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఫ్లెక్సీల వ్యవహారంలో ఎమ్మెల్యే ఆనందరావు, దొరబాబు వ్యక్తిగత పట్టుదలలకు పోవడంతో అది కాస్తా రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిని ఒకరు సవాలు చేసుకునేందుకు దారి తీసింది. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఉందని పోలీసులు తొలగింపునకు వెనకడుగు వేయగా, టీడీపీ నేతలే వాటిని తొలగించారు. ఈ నేపథ్యంలో అల్లవరం ఎస్సై రాజేష్కుమార్ను జిల్లాలో కొత్తగా చేరిన మోతుగూడెం స్టేషన్కు బదిలీ చేశారు. హడావిడిగా జరిగిన ఈ బదిలీకి ఫ్లెక్సీ వివాదంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్న అధికారపార్టీ నేతల కక్షసాధించే కారణమని బీజేపీ వారు భావిస్తున్నారు. బీజేపీని అణచాలని చూస్తున్నారు.. ఎమ్మెల్యే ఆనందరావు తీరుపై జిల్లా బీజేపీ నాయకులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని శనివారం భీమవరంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీల విషయంలో ఆనందరావు బీజేపీ నాయకుల పట్ల వ్యవహరించిన తీరు, కార్యకర్తలపై కేసులు పెట్టించడం వంటి విషయాలను దొరబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.నాయుడు తదితరులు కేంద్ర మంత్రికి వివరించారు. మిత్రపక్షమై ఉండీ ఎమ్మెల్యే తమను శత్రువులుగా చూస్తున్నారని నిరసించారు. మోదీ ఫొటో ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేయడమే కాక గ్రామంలో బీజేపీకి క్యాడర్ లేకుండా చేసేం దుకు, పార్టీని ఎదగనివ్వకుండా అణచేసేందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుశ్చర్యలను అడ్డుకున్నందుకే ఎస్సైకి అన్యాయంగా బదిలీ చేశారని చెప్పారు. జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలను అందజేశారు. ఎమ్మెల్యే ప్రత్యేకించి ఓ సామాజికవర్గాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. తాము చెప్పిన దానిపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినట్టు ఆల్డా చైర్మన్ దొరబాబు స్థానిక విలేకరులకు తెలిపారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ ఫిషర్మెన్ సెల్ కన్వీనర్ కర్రి చిట్టిబాబు, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, మత్స్యకార సంఘ నాయకుడు మల్లాడి హనుమంతరావు, పార్టీ నాయకులు పాలూరి సత్యానందం, బసవా చినబాబు, బసవా సింహాద్రి ఉన్నారు. రగడను పట్టించుకోని రాజప్ప మిత్రుల మధ్య రగులుతున్న చిచ్చును చల్లార్చేందుకు టీడీపీ జిల్లా నాయకులు కనీసంగా ప్రయత్నించకపోవడం గమనార్హం. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గమైన అమలాపురంలో బీజేపీ, టీడీపీ నేతలు ఆధిపత్య పోరుకు దిగుతున్నా ఆయన జోక్యం చేసుకోకపోవడం క్యాడర్ను విస్మయానికి గురి చేస్తోంది.