విజయవాడలో పోటెత్తిన భక్తులు | pilgrims heavy rush at vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో పోటెత్తిన భక్తులు

Nov 6 2014 6:34 AM | Updated on Sep 2 2017 3:59 PM

కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకదుర్గ దేవాలయానికి భక్తులు పోటెత్తారు.

హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు, ఇతర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  విజయవాడ కనకదుర్గ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయమే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వేకువజామునుంచే భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ రోజు లక్షన్నర వరకు భక్తులు రావచ్చని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం, అనంతపురం జిల్లా పెన్నహోబిళం, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement