ప్రియునితో టీ గొడవ

Young Woman Commits Suicide For Tea With Boyfriend in Karnataka - Sakshi

 యువతి ఆత్మహత్య  

కర్ణాటక, తుమకూరు: అనుమానాస్పద స్థితిలో యువతి చికెన్‌ దుకాణంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం శిర తాలూకా కళ్లంబెళ్లలో చోటు చేసుకుంది. బెంగళూరులోని మారతహళ్లికి చెందిన అశ్వని (25) అక్కడికి సమీపంలోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో రెండేళ్లుగా పని చేస్తుండేది. డయాగ్నస్టిక్‌ సెంటర్‌ యజమాని ప్రభాత్, అశ్వని కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే మంగళవారం టీ చేసే విషయంపై ఇరువురి మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన యువతి స్కూటీపై కళ్లంబెళ్లకు చేరుకొంది. అక్కడే ఖాళీగా ఓ చికెన్‌ షాపులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top