వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

Young Woman Commits Suicide Husband Harassments - Sakshi

లంగర్‌హౌస్‌: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ మండలం, కిష్టాపురం గ్రామానికి చెందిన రాములు, లక్ష్మమ్మ దంపతుల కుమార్తె లావణ్య(19). వారి ఇంటి పక్కనే ఉంటున్న రాములు కుమారుడు మహేష్‌ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. తొలుత వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారిపై ఒత్తిడి చేయడంతో ఆగస్టు 21న వారికి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత నగరానికి మకాం మార్చిన వీరులంగర్‌హౌస్‌ పరిధిలోని రాజీవ్‌గాంధి నగర్‌లో నివాసం ఉంటున్నారు.

మహేష్‌  ఫుడ్‌ డెలివరి బాయ్‌గా పనిచేసేవాడు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే భార్య లావణ్యను కట్నం తేవాలని  వేధించడమేగాక కొద్ది రోజుల క్రితం ఇంట్లోనుంచి వెళ్లగొట్టాడు. గ్రామంలో పెద్దలు పంచాయితీ చేసి ఇద్దరికి నచ్చజెప్పి పంపారు.అయినా మహేష్‌ వేధింపులు మానుకోకపోవడంతో మనస్థాపానికిలోనైన లావణ్య మంగళవారం తెల్లవారుజామున నింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం దీనిని గుర్తించిన చూసిన మహేష్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. లావణ్యతల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top