కోల్‌కతాలో పాములపాడు వాసి దుర్మరణం | Young Man Died In Road Accident In Kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో పాములపాడు వాసి దుర్మరణం

Apr 6 2018 1:00 PM | Updated on Aug 30 2018 4:20 PM

Young Man Died In Road Accident In Kolkata - Sakshi

సురేష్‌ (ఫైల్‌)

పాములపాడు/ఆత్మకూరు రూరల్‌:  పాములపాడుకు చెందిన ఓ యువకుడు కోల్‌కతాలో దుర్మరణం చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు గురువారం  తెలిపారు. మృతుడు కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కలబండి రాముడు, ఏసురత్నమ్మ దంపతుల కుమారుడు సురేష్‌(25) అలియాస్‌ సుంకన్న లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఆత్మకూరుకు చెందిన లారీ డ్రైవర్‌ సిరాజ్‌తో కలసి కోల్‌కతా వెళ్లాడు. ఈనెల 2వ తేదీన అక్కడికి చేరుకున్నారు.

ఈనెల 3వ తేదీన లారీ లోడింగ్‌ కోసం సిటీలోకి లోకల్‌ డ్రైవర్‌ తీసుకెళ్లడంతో లారీ డ్రైవర్, క్లీనర్‌ సిటీ బయటనే ఉన్నారు. ఈ క్రమంలో సురేష్‌ అక్కడి నుంచి బయటకు వెళ్లి వస్తానంటూ వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం డ్రైవర్‌ సిరాజ్‌ గాలించాడు. కాగా ఓ ప్రాంతంలో సురేష్‌ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్లు మృతుడిది ఆత్మకూరు ప్రాంతంగా గుర్తించి వాట్సప్‌ ద్వారా ఫొటోలు ఇక్కడి వారికి పంపారు. పూర్తి సమాచారం లేకపోవడంతో ఆలస్యంగా గురువారం మృతుడి కుటుంబ సభ్యులకు ఫొటోలు చేరడంతో గుర్తించి బోరుమన్నారు. వెంటనే లారీ డ్రైవర్‌ సమాచారం చేరవేశారు.   

మృతదేహం కోసం నిరీక్షణ:  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సురేష్‌ మృతదేహం కోసం బంధువులు నిరీక్షిస్తున్నారు. స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కుటుంబీకులు, బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు లారీ యజమాని ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డిని కలిసేందుకు గురువారం బంధువులు పెద్ద ఎత్తున ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి చేరుకున్నారు. కాగా యజమాని అందుబాటులో లేరు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చి కోల్‌కతా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement