
లత మృతదేహం
చిగురుమామిడి(హుస్నాబాద్) : మండలంలోని చిన్నముల్కనూర్కు చెందిన ఇరుకుల్ల లత (26) క్రిమిసంహారక మందుతాగి.. ఆపై వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లత, అంజయ్య భార్యాభర్తలు. వీరికి అక్షిత, హర్షిణి, యశ్వంత్ సంతానం.
అంజయ్య బతుకుదెరువు నిమిత్తం గల్ఫ్దేశం వెళ్లాడు. దీంతో పిల్లలతో కలిసి లత తన అత్తమామలతో నివాసముంటోంది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. లత మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగింది. అనంతరం ఓ వ్యవసాయబావిలో దూకింది.
ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. భార్య మరణ విషయం తెలుసుకున్న అంజయ్య గల్ఫ్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తిం హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు.