క్రిమిసంహారక మందుతాగి.. బావిలో దూకి | Women Committed Suicide In Husnabad | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

May 30 2018 1:58 PM | Updated on May 30 2018 2:14 PM

Women  Committed Suicide In Husnabad - Sakshi

లత మృతదేహం

చిగురుమామిడి(హుస్నాబాద్‌) : మండలంలోని  చిన్నముల్కనూర్‌కు చెందిన ఇరుకుల్ల లత (26) క్రిమిసంహారక మందుతాగి.. ఆపై వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లత, అంజయ్య భార్యాభర్తలు. వీరికి అక్షిత, హర్షిణి, యశ్వంత్‌ సంతానం.

అంజయ్య బతుకుదెరువు నిమిత్తం గల్ఫ్‌దేశం వెళ్లాడు. దీంతో పిల్లలతో కలిసి లత తన అత్తమామలతో నివాసముంటోంది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. లత మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగింది. అనంతరం ఓ వ్యవసాయబావిలో దూకింది.

ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. భార్య మరణ విషయం తెలుసుకున్న అంజయ్య గల్ఫ్‌ నుంచి బయలుదేరినట్లు సమాచారం. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తిం హుస్నాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement