భర్త గొంతు నులిమి చంపేసిన భార్య

భీమవరంలో దారుణం..
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. భర్తను ఓ భార్య గొంతు నులిమి చంపేసింది. భీమవరానికి చెందిన సత్యశర్మ, హేమ నాగమణి దపంతులు. వీరి మధ్య ఇటీవల కుటుంబ కలహాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్త సత్య శర్మను భార్య హేమనాగమణి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి