గుండెపోటుతో ఉత్తర్‌ప్రదేశ్‌వాసి మృతి | Uttar Pradesh Man Died Of Heart Attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఉత్తర్‌ప్రదేశ్‌వాసి మృతి

Apr 6 2018 1:30 PM | Updated on Apr 6 2018 1:30 PM

Uttar Pradesh Man Died Of Heart Attack - Sakshi

లాల్‌బహదూర్‌మృతదేహం

శంకరపట్నం(మానకొండూర్‌): శంకరపట్నం మండలం మొలంగూర్‌ శివారులో గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌ వాసి గుండెపోటుతో మృతిచెందినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ జయశంకర్‌ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లాల్‌బహుదూర్‌(50) కొంతకాలంగా శంకరపట్నం మండలంలో ఐస్‌క్రీమ్‌లు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందాడు. స్థానికులు  కేశవపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని హెడ్‌కానిస్టేబుల్‌ జయశంకర్‌ పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement