కత్తులతో ఇద్దరు వ్యక్తుల పరస్పరం దాడి | Two Men Attack Each Other With Swords In Banjarahills | Sakshi
Sakshi News home page

కత్తులతో ఇద్దరు వ్యక్తుల పరస్పరం దాడి

Jan 28 2020 12:05 PM | Updated on Jan 28 2020 2:43 PM

Two Men Attack Each Other With Swords In Banjarahills - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌ : బంజారాహిల్స్‌లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. కాగా రవీందర్‌(22), నవాజ్‌(20) కత్తులతో పరస్పరం దాడి చేసుక్నునట్లు తెలిసింది. అయితే ఎందుకు కత్తులతో దాడి చేసుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలోనే వీరిద్దరిపై కేసులు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రవీందర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు  నవాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement