మావోయిస్టుల దుశ్చర్య: జవాన్ల మృతి

two jawans killed in IED blast at chhattisgarh - Sakshi

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని కుత్రు వద్ద మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.  పోలీసులు, జవాన్లు కలిసి సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా పేలుడు సంభవించినట్లు స్పెషల్ డీజీ తెలిపారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top