హిందూపురం రైలు పట్టాలపై మృతదేహాలు..

Three Deadbodies Found On Near Hindupur Railway Station - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. హిందూపురం-బెంగుళూరు వెళ్లే రైలు మార్గంలో పట్టాలపై మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మృతి చెందిన వారిలో ఒకరు గోళాపురంకు చెందిన ఆదినారాయణగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ముకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపి రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ముగ్గురి మృతదేహాలు రైల్వేస్టేషన్‌కు కిలోమీటర్‌ దూరంలో పడి ఉన్నాయి. ఇదే రైలు మార్గంలో హిందూపురం పట్టణానికి 25 ​కిలోమీటర్ల దూరంలో మరో వ్యక్తి మృతదేహం లభ్యమయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top