భారీ చోరీ:100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు అపహరణ
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో శనివారం భారీ చోరీ జరిగింది. బిల్డర్ కార్యాలయంలోకి చొరబడిన దుండగుడు 100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, రివాల్వర్, 20 బుల్లెట్లను అపహరించాడు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్ అధినేత కోటారెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సుధీర్రెడ్డిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.