టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం | TDP MLAs Are Safe In Road Mishap | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం

Sep 12 2018 10:59 AM | Updated on Apr 3 2019 7:53 PM

TDP MLAs Are Safe In Road Mishap - Sakshi

ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న మట్టిలో దిగబడిపోయింది.

ఏలూరు: విజయవాడ నుంచి పోలవరం సందర్శనకు బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న మట్టిలో దిగబడిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ఎంత సేపు ప్రయత్నించినా బస్సు దిగబడిన ప్రాంతం నుంచి కదల్లేక పోవడంతో బస్సులో ఉన్న 35 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వేరే వాహనాల్లో పోలవరానికి తరలించారు.




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement