సిరివెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి | road accident at sirivella..two died | Sakshi
Sakshi News home page

సిరివెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

Jan 1 2018 10:26 AM | Updated on Jan 1 2018 4:48 PM

కర్నూలు : సిరివెళ్ల వద్ద ఆదివారం అర్ధరాత్రి  రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ స్విఫ్ట్‌ కారు జేసీబీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం మధురపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ఈ ఘటనలో ప్రవీణ్ గౌడ్ (25), ప్రవీణ్ (26)లు అక్కడికక్కడే మృతిచెందగా..అర్జున్ రెడ్డి (26), చంద్ర మోహన్ (25)తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే వీరు కొత్తగా మారుతీ మారుతీ స్విఫ్ట్ కారు కొన్నారు. ఈ  సందర్భంగా స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతికి వెళ్లి వెంకటేశ్వరస్వామి వారిని​ దర్శనం చేసుకుని  తిరిగి వస్తుండగా కర్నూలు జిల్లా సిరివెళ్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement