breaking news
Farukh Nagar
-
అక్షరాల గుడి... 150 ఏళ్ల బడి
సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్నగర్: అక్షర సుమమై వికసించింది.. ఎంతోమంది మేధావులకు అక్షరాలను నేర్పించింది. ఈ చారిత్రక సరస్వతీ నిలయం ప్రత్యేకతను చాటుతూ 150 వసంతాలను పూర్తి చేసుకుంది. అదే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది స్వాతం్రత్యానికి పూర్వమే ఏర్పాటైంది. శుక్రవారం 150 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అనేకమంది ప్రముఖుల అక్షరాభ్యాసం ఈ బడిలో అనేక మంది ప్రముఖులు అక్షరాభ్యాసం చేశారు. తర్వాత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో దేశవిదేశాల్లో స్థిర పడ్డారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, యూపీ మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఓయూ మాజీ వీసీ మల్లారెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుడు రంగారావు, పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ సహా అనేక మంది ఇక్కడ అక్షరాలు దిద్దినవారే. గ్రామస్తుల్లో చైతన్యం రగిలించేందుకు.. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తుర్రెబాజ్ఖాన్ అప్పట్లో వారి నుంచి తప్పించుకుని షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్దలో ఆశ్రయం పొందినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ విషయం నిజాంకు తెలిసి తుర్రెబాజ్ఖాన్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్కు తరలించి ఉరి తీసినట్లు ప్రచారం ఉంది. గ్రామస్తులను విద్యాపరంగా చైతన్యవంతులను చేయాలనే సంకల్పంతో నాటి నిజాం సర్కార్ 1873లో మొగిలిగిద్దలో పాఠశాలను ఏర్పాటు చేసింది. మొదట్లో ఉర్దూ మీడియంలో విద్యాబోధన చేయగా, 1948లో తెలుగు మాధ్యమంలో బోధనను ప్రారంభించారు. నిజానికి పాఠశాల ప్రారంభమై 152 ఏళ్లుపూర్తి కావొస్తున్నా.. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు 150వ వార్షికోత్సవాన్ని (కోవిడ్ కారణంగా రెండేళ్లు ఉత్సవాలు వాయిదా వేశారు) జరుపుకొనేందుకు సంసిద్ధులయ్యారు. ఇక్కడ 500 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన స్వాతం్రత్యానికి ముందే ఇక్కడ పోలీస్స్టేషన్తోపాటు గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ఠాణా కింద 140 గ్రామాలు ఉండేవి. ఈ పోలీస్స్టేషన్ను 1983లో కొందుర్గ్కు తరలించారు. ఈ చారిత్రక గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా ఉంది. పాఠశాల వార్షికోత్సవాలను పురస్కరించుకుని సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మొగిలిగిద్దకు చేరుకోనున్నారు. పాఠశాలలో పలు మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
-
సిరివెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
కర్నూలు : సిరివెళ్ల వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ స్విఫ్ట్ కారు జేసీబీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం మధురపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో ప్రవీణ్ గౌడ్ (25), ప్రవీణ్ (26)లు అక్కడికక్కడే మృతిచెందగా..అర్జున్ రెడ్డి (26), చంద్ర మోహన్ (25)తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే వీరు కొత్తగా మారుతీ మారుతీ స్విఫ్ట్ కారు కొన్నారు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతికి వెళ్లి వెంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కర్నూలు జిల్లా సిరివెళ్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్ బాలికపై అత్యాచార యత్నం, ఆపై దారుణ హత్య
గుర్గాన్: ఓ 12ఏళ్ల మైనార్ బాలికను దారుణంగా హత్యచేసిన మహ్మద్ హుస్సేన్ (23) అనే వ్యక్తిని అస్సాం రాష్ట్రంలోని బార్పేట్ జిల్లాలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందుతుడు బాలికపై అత్యాచారానికి యత్నించగా, ఆ బాలిక ప్రతిఘటించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుర్గాన్లో గతనెల 30న చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడు అస్గర్ అలీ ఫిర్యాదు మేరకు ఫరూక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబం గత 10 సంవత్సరాలుగా ఫరూక్ నగర్లో నివాసముంటున్నారు. అయితే నిందుతుడు మహ్మద్ హుస్సేన్, అస్గర్ అలీ తండ్రి వద్ద 30వేలు అప్పు తీసుకున్నాడు. అ అప్పు తిరగివ్వమని అడిగితే అందుకు హుస్సేన్ తిర్కసరించాడు. దీంతో వారు పెద్దల సమక్షంలో పంచాయతీలో చర్చించి తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాల్సిందిగా హెచ్చరించారు. దాంతో హుస్సేన్ ఎలాగైనా వారి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడు హుస్సేన్, అస్గర్ అలీ సోదరిపై అత్యాచారానికి యత్నించాడు. అది కాస్తా విఫలమవడంతో ఆ మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్యచేశాడు. బాలిక శరీర భాగాలు తల, అంతర అవయవాలను ఓ పదునైన వస్తువుతో కోసినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.