పేలిన టైరు..మూడు పల్టీలు కొట్టిన కారు | Road Accident In Nalgonda District | Sakshi
Sakshi News home page

పేలిన టైరు..మూడు పల్టీలు కొట్టిన కారు

May 3 2018 12:14 PM | Updated on Aug 30 2018 4:20 PM

Road Accident In Nalgonda District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నల్గొండ జిల్లా : తిప్పర్తి మండలం రామలింగాల గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను  మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు వెనుక టైరు పేలిపోవడం తో డివైడర్‌ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. 

ప్రమాద సమయంలో కారులో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా చెరుకుపల్లి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు చెరుకు పల్లి ఎస్సీ కాలనీకి చెందిన మామిడి రమేష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement