రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | Road Accident In Kurnool District | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Apr 12 2018 7:22 AM | Updated on Aug 30 2018 4:20 PM

Road Accident In Kurnool District - Sakshi

ప్రమాదంతో నుజ్జునుజ్జయిన ఆటో  (ఇన్‌సెట్లో) పాములేటిని చేతిలోకి తీసుకుని విలపిస్తున్న సోదరుడు

మహానంది : నల్లమల ఘాట్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శిరివెళ్ల ఎస్‌ఐ తోటసాయినాథ్‌ తెలిపిన వివరాల మేరకు..శిరివెళ్ల మండలం పచ్చర్లకు చెందిన మండ్ల పాములేటి(21)ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో రుణానికి సంబంధించి కంతులను చెల్లించేందుకు నంద్యాలకు చెందిన చిన్నపాములేటి(వరుసకు అన్న), మిత్రుడు రాజశేఖర్‌లతో కలిసి ఇంటి నుంచి బయలుదేరారు. కొద్దిదూరంలోకి వెళ్లగానే వేగంగా వస్తున్న ఓ తుపాన్‌ వాహనం ఢీకొట్టడంతో మండ్ల పాములేటికి తలకు, ఛాతీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో ఇద్దరూ గాయపడ్డారు.

తీవ్ర రక్తస్రావమై నొప్పులతో అల్లాడుతున్న పాములేటిని ఆస్పత్రికి తరలించేందుకు వాహనం సౌకర్యం లేకపోవడంతో గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు అష్టకష్టాలు పడి  నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమిచండంతో కోలుకోలేక మృతి చెందాడు. అతడి మృతితో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. శిరివెళ్ల ఎస్‌ఐ తోట సాయినా«థ్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement