ప్రియుడితో పారిపోయేందుకు మహిళ ఘాతుకం.. | Punjab Boy Dies After Mother Stuffs Him In Bed Box | Sakshi
Sakshi News home page

ప్రియుడితో పారిపోయేందుకు మహిళ ఘాతుకం..

Jan 28 2020 8:21 AM | Updated on Jan 28 2020 8:22 AM

Punjab Boy Dies After Mother Stuffs Him In Bed Box - Sakshi

అనైతిక బంధాలు పెచ్చుమీరి హత్యలకు దారితీస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.

చండీగఢ్: ప్రియుడితో పారిపోయేందుకు మహిళ తన రెండున్నరేళ్ల చిన్నారిని పరుపు కింద కుక్కడంతో ఊపిరాడక బాబు మరణించిన ఘటన పంజాబ్‌లోని బురాలి గ్రామంలో వెలుగుచూసింది. ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్న దశరథ్‌ పనులు ముగించుకుని ఇంటికి రాగా, భార్య కుమారుడు కనిపించకపోవడంతో వారు అత్తవారింటికి వెళ్లి ఉంటారని భావించాడు. భార్యకు ఫోన్‌ చేయగా తాను ఇంట్లో లేనని, బాలుడిని పరుపు కింద పడుకోబెట్టానని చెప్పడంతో దశరథ్‌ పరుపు కింద చూడటంతో రెండున్నరేళ్ల చిన్నారి విగతజీవిగా కనిపించాడు. కొడుకును హత్య చేసి తన భార్య ప్రియుడితో పారిపోయిందని దశరథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement