మానవ రవాణా కేసు ఎన్‌ఐఏకు బదిలీ

Police Transfer Human Trafficking Case To NIN In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక దేశం నుంచి మరో దేశానికి మానవ అక్రమ రవాణా కేసును ఛత్రినాక పోలీసులు ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. వివరాలు.. బంగ్లాదేశ్‌ యువతులను హైదరాబాద్‌లోకి అక్రమంగా తరలించిన యూసఫ్‌ఖాన్‌, బీతి బేగం, సోజీబ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు వివిధ దేశాల నుంచి యువతులను తీసుకువస్తూ హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో వ్యభిచారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నరని పోలీసులు తెలిపారు. అయితే ఏప్రిల్‌ 24న ఛత్రినాక పోలీసులు నగరంలోని వ్యభిచార కేంద్రాలపై రైడ్‌ చేసి.. యూసఫ్‌ఖాన్‌, బీతి బేగంలను అరెస్ట్‌ చేశారు. దీంతో  ఈకేసును మరింత లోతుగా విచారించేందుకు ఎన్ఐఏకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top