ఫోన్‌లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి..

Person Suicide In Atmakuru Because Of Love Failure - Sakshi

సాక్షి, ఆత్మకూర్‌ (కొత్తకోట): నాలుగేళ్లుగా ప్రేమించిన అమ్మాయి దూరమైందని కలత చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆరేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌గౌడ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌గౌడ్‌(25) హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఉంటూ కన్‌ స్ట్రక్షన్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కానీ అమ్మాయి కిరణ్‌ ప్రేమను తిరస్కరించింది.

అనంతరం హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్టేషన్‌లో, అలాగే షీటీంకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిరణ్‌కు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్‌ ఆత్మహత్యకు పాల్పడుతున్న కారణాలను సూసైడ్‌ నోట్‌తోపాటు తన ఫోన్‌లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి యూట్యూబ్, వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశాడు. అనంతరం మండలంలోని శ్రీరాంనగర్‌ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మధ్యాహ్నం 2.25 గంటలకు ఏపీ సంపర్క్‌ క్రాంతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో కిరణ్‌ మృతదేహం ముక్కలుగా విడిపోయి చాలాదూరం పడిపోయాయి. గద్వాల రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ రామకృష్ణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top