breaking news
Superviser
-
కాన్పు చేసిన డ్యూటీ సూపర్వైజర్
-
ఫోన్లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి..
సాక్షి, ఆత్మకూర్ (కొత్తకోట): నాలుగేళ్లుగా ప్రేమించిన అమ్మాయి దూరమైందని కలత చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆరేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్గౌడ్కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్కుమార్గౌడ్(25) హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఉంటూ కన్ స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కానీ అమ్మాయి కిరణ్ ప్రేమను తిరస్కరించింది. అనంతరం హైదరాబాద్లోని నల్లకుంట పోలీస్టేషన్లో, అలాగే షీటీంకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిరణ్కు కౌన్సిలింగ్ నిర్వహించారు. తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్ ఆత్మహత్యకు పాల్పడుతున్న కారణాలను సూసైడ్ నోట్తోపాటు తన ఫోన్లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. అనంతరం మండలంలోని శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్కు సమీపంలో మధ్యాహ్నం 2.25 గంటలకు ఏపీ సంపర్క్ క్రాంతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో కిరణ్ మృతదేహం ముక్కలుగా విడిపోయి చాలాదూరం పడిపోయాయి. గద్వాల రైల్వే హెడ్కానిస్టేబుల్ రామకృష్ణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గొడ్డలితో కూలీని చంపిన సూపర్వైజర్
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): సూపర్వైజర్కు, కూలీకి మధ్య జరిగిన ఘర్షణలో కార్మికుడు మృతిచెందగా.. సూపర్వైజర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తున్న సుధాకర్ (35)కు సూపర్వైజర్ బ్రహ్మయ్యకు మధ్య ఈ రోజు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన బ్రహ్మయ్య పక్కనే ఉన్న గొడ్డలితో సుధాకర్ తలపై కొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో బ్రహ్మయ్యకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.