సైకిల్‌ కోసం వచ్చి.. కెమెరాకు చిక్కి..! | Person arrested in bicycle theft case in Bangalore | Sakshi
Sakshi News home page

సైకిల్‌ కోసం వచ్చి.. కెమెరాకు చిక్కి..!

Dec 6 2017 4:40 PM | Updated on Aug 11 2018 6:07 PM

సాక్షి, బొమ్మనహళ్లి: అత్యంత ఖరీదైన సైకిల్‌ను చోరీ చేసేందుకు వచ్చిన దొంగను స్థానికులు సీసీ కెమెరా ద్వారా పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బెంగళూరులోని సుబ్రమణ్య నగర్‌లో ఈ నెల 3న చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఓ దొంగ సుబ్రమణ్య నగర్‌లో చోరీ కోసం రెక్కీ నిర్వహించాడు.

వెంకటేష్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఖరీదైన సైకిల్‌పై అతని కన్ను పడింది. ఆ రోజు సాయంత్రం కట్టర్‌ సహాయంతో తాళం తొలగించి సైకిల్‌ను చోరీ చేస్తుండగా యజమాని సీసీ కెమెరా ద్వారా గుర్తించి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. భయందోళనకు గురైన ఆ దుండగుడు అక్కడే ఉన్న కారు కింద దాక్కున్నాడు. అది గమనించిన స్థానికులు ఆ వ్యక్తి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందుతుడు   తన పేరు కల్లెష్‌ అని ఒక్కసారి మల్లేష్‌అని మరోసారి చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement