పురుగులు పీక్కు తిన్నాయి.. | Patient Eaten Alive By Parasites | Sakshi
Sakshi News home page

పురుగులు పీక్కు తిన్నాయి..

Apr 28 2018 11:01 AM | Updated on Apr 28 2018 3:38 PM

Patient Eaten Alive By Parasites - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బ్లిసీ, జార్జియా ​: రాజధాని బ్లిసీలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మోడల్‌ రెబెక్కా జెనీను బ్రతికుండగానే పురుగులు పీక్కు తిన్నాయి. జెనీ చర్మ బాహ్యత్వచంపై అభివృద్ధి చెందిన ఇచ్‌మైట్స్‌ పెద్ద ఎత్తున గుడ్లను పెట్టినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

కన్ను గుర్తించలేని సైజులో ఉండే ఈ జీవులు ఆమె శరీరాన్ని లోలోపల తినేయడం ప్రారంభించాయని వెల్లడించారు. డెమన్షియా వ్యాధితో 2010లో ప్రూఇట్‌ హెల్త్‌ ఆసుపత్రి జెనీను ఆమె కూతురు చేర్చారు. అప్పటి నుంచి ఆమెకు అక్కడే వైద్య చికిత్సను అందిస్తున్నారు. కాగా, జెనీ మృతిపై ఆసుపత్రిని ఆమె కూతురు కోర్టుకు ఈడ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement