breaking news
parasitic diseases
-
పురుగులు పీక్కు తిన్నాయి..
బ్లిసీ, జార్జియా : రాజధాని బ్లిసీలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మోడల్ రెబెక్కా జెనీను బ్రతికుండగానే పురుగులు పీక్కు తిన్నాయి. జెనీ చర్మ బాహ్యత్వచంపై అభివృద్ధి చెందిన ఇచ్మైట్స్ పెద్ద ఎత్తున గుడ్లను పెట్టినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కన్ను గుర్తించలేని సైజులో ఉండే ఈ జీవులు ఆమె శరీరాన్ని లోలోపల తినేయడం ప్రారంభించాయని వెల్లడించారు. డెమన్షియా వ్యాధితో 2010లో ప్రూఇట్ హెల్త్ ఆసుపత్రి జెనీను ఆమె కూతురు చేర్చారు. అప్పటి నుంచి ఆమెకు అక్కడే వైద్య చికిత్సను అందిస్తున్నారు. కాగా, జెనీ మృతిపై ఆసుపత్రిని ఆమె కూతురు కోర్టుకు ఈడ్చారు. -
తామర, మలేరియాలపై పరిశోధనలకు నోబెల్
అట్లాంటా: ఏళ్లుగా మానవాళిని తీవ్రంగా బాధిస్తోన్న తామర, మలేరియా వ్యాధులపై పరిశోధనలకుగానూ మెడిసిన విభాగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఈమేరకు సోమవారం జరిగిన కార్యక్రమంలో నోబెల్ కమిటీ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది. శరీరం నుంచి తామర నిర్మూలను సరికొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టినందుకుగానూ జపాన్ శాస్త్రవేత్త సాన్ తోషి ఒమురా, అమెరికన్ శాస్త్రవేత్త విలియమ్. సి. క్యాంప్ బెల్ లకు నోబెల్ దక్కింది. చైనా శాస్త్రవేత్త యుయూ తూ కూడా వీరితోపాటు పురస్కారాన్ని పంచుకున్నారు. మలేరియా నివారణకు నూతన విధానాలు కనుగొన్నందుకుగానూ ఆమెకు ఈ పురస్కారం లభించింది. టోక్యోలోని కిటాసాతో యూనివర్సిటీకి చెందిన సాన్ తోషి.. ఐర్లాండ్ కు చెందిన విలియమ్ క్యాంప్ బెల్ తో కలిసి తామరపై పలు పరిశోధనలు చేశారు. క్యాంప్ బెల్ అమెరికాలోని డ్రేవ్ యూనివర్సిటీ (మాడిసన్, న్యూజెర్సీ)కి చెందినవారు. ఇక యుయూ తూ.. బీజింగ్ లోని చైనా అకాడమీ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో మలేరియాపై పలు పరిశోధనలు చేశారు.