పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం

Paritala Sunitha Supporters Assault On Poor People - Sakshi

సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. కురుగుంట గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని పేదల నుంచి పరిటాల వర్గీయులు డబ్బులు వసూలు చేశారు. తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరిన వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు అనంతపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

బాధితులను పరామర్శించిన తోపుదుర్తి చందు..
కురుగుంట గ్రామస్తులను ఆదివారం వైఎస్సార్‌సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చందు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు అధికమయ్యాయని మండిపడ్డారు. కౌంటర్‌ కేసులతో బాధితులను భయపెడుతున్నారన్నారు. పరిటాల వర్గీయులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top