పైప్లైన్ మరమ్మతుల్లో ఒకరు మృతి
సాక్షి, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద విషాదం చోటుచేసుకుంది. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పైప్లైన్ మరమ్మతు పనుల్లో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గూడెం గ్రామానికి చెందిన సాయి(18) పైప్లైన్ లీకేజీ మరమ్మతు పనుల్లో పాల్గొన్నాడు. పక్కనే ఉన్న మట్టిపెళ్ల అతనిపై పడడంతొ అతను మృతిచెందాడు. ఇతను పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ లక్షెట్టిపేట చౌరస్తా వద్ద మృతదేహంతో అతని కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో చేస్తున్నారు.