ఖాజీపేట వద‍్ద రోడ్డు ప్రమాదం

ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

సాక్షి, ఖాజీపేట : అయ్యప్పస్వామి దీక్ష అనంతరం శబరిమల వెళ్ళి అయ్యప్పస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేట హైవేపై పెట్రోలు బంకు సమీపంలో ఆదివారం తుఫాన్ వాహనం గేదెలను తప్పించబోయి పక‍్కనున‍్న కల‍్వర్టును ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మతిచెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాగా... వీరందరూ శబరిమల నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top