చిత్ర హింసలకు గురైన వృద్ధురాలి మృతి | Old Lady Died In Hospital | Sakshi
Sakshi News home page

చిత్ర హింసలకు గురైన వృద్ధురాలి మృతి

Apr 21 2018 9:49 AM | Updated on Apr 3 2019 8:07 PM

Old Lady Died In Hospital - Sakshi

రాజమహేంద్రవరం క్రైం : మూడు నెలలు చిత్ర హింసలకు గురైన వృద్ధురాలు నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. రాజా నగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతి భర్త దొరయ్య మృతి చెందాడు. పుష్పవతికి వారసులు లేరు. రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీలో తనకు చిన్నమ్మ కుమార్తె  చెల్లెలు వరుసయ్యే మంగాదేవి ఇంట్లో ఉంటోంది.

కాళ్లు, చేతులు చచ్చపడిపోవడంతో మంచానికే పరిమితమైన పుష్పవతిని తనకు ఉన్న భూమి కోసం సంతకం చెయ్యాలంటూ మూడు నెలలుగా నిత్యం కర్రలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ సంఘటనను చుట్టుపక్కల వారు గమనించి వీడియో తీసి సోషల్‌ మిడియాలో పెట్టడంతో కలకలం రేగింది. స్థానికుల సహాయంతో వృద్ధురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వం హాస్పటల్‌లో చేర్చారు.

వృద్ధురాలి పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. హాస్పటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఈ కేసులో చిత్రహిసలకు గురిచేసిన  నిందితురాలు ప్రగడ మంగాదేవిని బొమ్మురు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement