అమ్మా.. మాట్లాడమ్మా..!

Married woman died with electrical shock - Sakshi

విద్యుదాఘాతంతో వివాహిత మృతి

బుక్కపట్నం: ‘అమ్మా.. మాట్లాడమ్మా.. లే అమ్మా.. ఒక్కసారి మాట్లాడమ్మా’ అంటూ పిల్లలు రోదించిన తీరు కలచివేసింది. పాముదుర్తి వెంకటాపురంలో ఓ వివాహిత విద్యుదాఘాతంతో మృతిచెందింది. బంధువులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ఎద్దుల సుదర్శన్‌రెడ్డి భార్య వెంకటరమణమ్మ (30) మంగళవారం ఉదయం ఉతికిన బట్టలను మిద్దెపై ఆరేసే క్రమంలో జీఏ వైర్‌ను తాకింది. పైకçప్పు రేకులపై నుంచి ఇంటి సర్వీస్‌ వైర్‌కు సంబంధించి ఒక చోట ఎర్త్‌ కావటంతో జీఏ వైరుకు విద్యుత్‌ సరఫరా అయ్యి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తమ కళ్లెదుటే తల్లి ప్రాణం విడచడంతో పిల్లలు రోదించారు. విషయం తెలుసుక్ను వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి స్థానిక నాయకులు సూర్యనారాయణరెడ్డి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top