కూకట్‌పల్లిలో కలకలం.. ఏటీఎం పేల్చివేత

 Man sets ATM on fire, leaves a letter - Sakshi

తన సూచనలు లేఖలో రాసి పెట్టిన నిందితుడు

అవి అమలు చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

సాక్షి, హైదరాబాద్‌ : ఓ గుర్తు తెలియని వ్యక్తి పేలుడు పదార్థాల సహాయంతో ఏటీఎం సెంటర్‌లో రెండు సీసీ కెమెరాలు, ఏటిఎం మిషన్‌ను పేల్చివేసి ఓ లేఖను వదిలి వెళ్లిన సంఘటన ఆదివారం కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. సీఐ కుషాల్కర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మొహానికి రుమాలు కట్టుకుని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌ 1లో ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ ఏటిఎంలో ప్రవేశించిన ఓ యువకుడు ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో పేలుడు పదార్ధాలు, విద్యుత్‌ తీగల సహాయంతో ఏటిఎం మిషన్‌లోని రెండు సీసీ కెమెరాలు, ఏటిఎం మిషన్‌ను పేల్చివేశాడు.

అనంతరం తనతో పాటు తీసుకువచ్చిన లేఖను అక్కడే వదిలివేసి వెళ్లి పోయాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలకు పరిష్కార మార్గాలు సూచించాడు. తన లేఖలోని అంశాలను ప్రచారంలోకి తీసుకురాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు.  స్వల్పంగా యంత్రం దగ్ధమైనప్పటికి ఎలాంటి నష్టం జరగలేదని, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందు కు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన లేఖను 24 గంటల్లోపు మీడియాలో ప్రచారం చేయాలని లేనిపక్షంలో ఆత్మహత్యకు పాల్పడతానని పేర్కొనడం గమనార్హం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top