టాటా చెబుతూ.. | Man Died In Bike Accident Kurnool | Sakshi
Sakshi News home page

టాటా చెబుతూ..

Jun 29 2018 10:59 AM | Updated on Jun 29 2018 10:59 AM

Man Died In Bike Accident Kurnool - Sakshi

నాగేంద్రబాబు మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య

ఆళ్లగడ్డ రూరల్‌: జాతీయ రహదారిపై మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి తెలిసినవారు కనిపించడంతో టాటా చెబుతూ ప్రమాదవశాత్తూ డివైడర్‌న్‌ను ఢీ కొని మృతి చెందిన ఘటన చింతకొమ్మదిన్నె గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన నాగేంద్రబాబు(58) లింగమయ్యవీ«ధిలో బాబు టైలర్‌ షాప్‌ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.

పట్టణంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరై, అక్కడి నుంచి సొంతపని నిమిత్తం చాగలమర్రికి బయలు దేరాడు. చింతకొమ్మదిన్నె గ్రామం సమీపంలో తెలిసిన వారు కన్పించడంతో టాటా చెప్పే ప్రయత్నంలో  ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. భార్య రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement