ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ జంట

Lovers Commits suicide In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా పూడూర్ మండలం మైసమ్మ గడ్డ తండా సమీపంలో గురవారం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అబ్బాయి మృతి చెందగా అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి పూడూరు కస్తురిబా గాంధీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అబ్బాయి చన్‌గోముల్‌ గ్రామానికి చెందిన మహేష్‌గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన చన్‌ గోముల్‌ పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top