మత్తు లేని జీవితం వ్యర్థమని.. | Lockdown Five Men End Lives For Alcohol in Karnataka | Sakshi
Sakshi News home page

మత్తు లేని జీవితం వ్యర్థమని..

Mar 30 2020 7:14 AM | Updated on Mar 30 2020 8:49 AM

Lockdown Five Men End Lives For Alcohol in Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు/ బనశంకరి/ రాయచూరు రూరల్‌: లాక్‌డౌన్‌ వల్ల మద్యం దొరక్క కొందరు మందుబాబులు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారు. మైసూరు, దక్షిణ కన్నడ, తుమకూరు, బీదర్, హుబ్లీ జిల్లాల్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఈ నెల 22వ తేదీ నుంచి మద్యం షాపులు, బార్లు మూతపడ్డాయి. నిత్యం తాగుడుకు అలవాటుపడినవారు ఆకస్మాత్తుగా మందు దూరమయ్యేసరికి తట్టుకోలేకపోయారు.  
తుమకూరు జిల్లా మధుగిరి తాలుకా చిక్కదాళపట్టె గ్రామంలో హనుమంతప్ప అనే వ్యక్తి గొంతు కోసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  
మైసూరు జిల్లా హుణసూరులో ఓ మందుబాబు లక్ష్మణతీర్థ నదిలోకి దూకి చనిపోయాడు.   
బీదర్‌ జిల్లా భాల్కి పట్టణంలో బావిలో దూకి ఓ హోటల్‌ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా పరిధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు కడబ పోలీసులు తెలిపారు.  
హుబ్లీ హొసూరులోని గణేశ పార్కులో ఉరివేసుకుని ఓ మద్యంప్రియుడు ప్రాణాలు తీసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement