అటవీ అధికారి హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు | Forest officer murder case: 14 members to life imprisonment | Sakshi
Sakshi News home page

అటవీ అధికారి హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు

Sep 25 2017 7:09 PM | Updated on Oct 4 2018 6:03 PM

Forest officer murder case: 14 members  to life imprisonment - Sakshi

పత్రికాత్మక చిత్రం

సాక్షి, నిజామాబాద్ : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగయ్య హత్య కేసులో కోర్టు 14 మందికి జీవితఖైదు విధించింది.  అటవీ భూములను ఆక్రమించడాన్ని గంగయ్య అడ్డుకోవడంతో తండా వాసులు ఆయన్ని హత్య చేశారు. ఈ సంఘటన 2013  సెప్టెంబర్‌ 14న నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లితండా అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 37 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 14మందిని దోషులుగా నిర్ధారించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు.. జీవితఖైదును విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. మరో 23 మందికి సాధారణ శిక్షలు విధించింది. శిక్ష పడిన 37 మందిలో ఒకరు చనిపోగా.. మరొకరు కోర్టుకు హాజరుకాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement