ఎన్‌కౌంటర్‌: ఐదుగురు మావోయిస్టుల మృతి

five maoists died in encounter at jharkhand - Sakshi

రాంచీ : జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెరెన్‌దాగ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కూంబింగ్ కొనసాగుతున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top