ప్రభుత్వ ఐటీఐ అధికారిపై ఏసీబీ దాడులు | ACB attacks on government ITI officer | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఐటీఐ అధికారిపై ఏసీబీ దాడులు

Dec 29 2017 1:16 AM | Updated on Aug 17 2018 12:56 PM

ACB attacks on government ITI officer - Sakshi

సాక్షి, అమరావతి/విజయవాడ : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు మేరకు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా స్థాయి శిక్షణా సంస్థ అధికారిగా పనిచేస్తున్న కోనేరు శ్రీనివాసకుమార్‌ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం దాడులు చేశారు.

ఉదయం ఐదు గంటల నుంచి విజయవాడ నగరంతో పాటు ఆటోనగర్, పెనమలూరు పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసకుమార్‌ కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులకు సంబంధించి ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. పెద్దఎత్తున బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ మీడియాకు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement